అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో మరో సారి గ్యాస్ లీకైన ఘటన కలకలాన్ని రేపింది. మంగళవారం సీడ్స్ కంపెనీ నుండి రసాయన వాయువు లీకవ్వడంతో పలువురు అస్వస్థతకు గురైయ్యారు. గత నెల మొదటి వారంలోనూ సెజ్ లోని పారస్ కంపెనీలో గ్యాస్ లీకవ్వడంతో వందలాది మంది అస్వస్థతకు గురైయ్యారు. ఈ ఘటన మరువక ముందే మరో సారి సెజ్ లో గ్యాస్ లీక్ కావడంతో ఆందోళన కల్గిస్తొంది.
ఒక్కసారిగా విషవాయువు విడుదల కావడంతో అక్కడ పని చేస్తున్న 50 మంది మహిళా కార్మికులు ఆస్వస్థతకు గురైయ్యారు. వాంతులు, వికారంతో మహిళలు ఇబ్బంది పడ్డారు. కొంత మంది సృహకోల్పోయారు. అస్వస్థతకు గురైన వారిని కంపెనీ యాజమాన్యం హుటాహుటిన ఆసుపత్రికి తరలించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గత నెలలో గ్యాస్ లీక్ కావడంతో 250 మందికిపైగా అస్వస్థతకు గురైయ్యారు. ఆనాటి ఘటనపై ప్రభుత్వం విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది.
ఏపిలో భూవివాదాల పరిష్కారానికి జగన్ సర్కార్ కీలక నిర్ణయం