ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు బుల్లితెరకు పరిచయమై ప్రేక్షకుల్ని ఎంతగానో నవ్విస్తున్నారు.ఈ షో ద్వారా మంచి పేరు తెచ్చుకొని బుల్లితెర నుంచి వెండితెర వరకూ ఎదుగుతున్నారు. ఇటీవల ఈ షో, మల్లెమాల సంస్థపై జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనికి తోడు ఒక్కొక్కరు ఈ షోలో నుంచి వెళ్లిపోవడం అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది ప్రేక్షకులకు.
స్టేజ్పై రీఎంట్రీ ఇచ్చి గెటప్
ఈ షో నుంచి సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను లాంటి మంచి కమెడియన్లు బయటికి వచ్చేసారు. అంతేకాకుండా యాంకర్ అనసూయ కూడా జబర్ధస్ షోకి బై బై చెప్పేసింది. ఆమె జూన్ లోనే జబర్దస్త్ షో నుంచి బయటికి వెళ్లినట్లు ఫ్యాన్స్ కి హింట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఒకరి తరువాత ఒకరు ఈ షో నుంచి వెళ్తున్నారు. ఇక షో కథ ముగిసినట్టే అని అందరూ అనుకునే సమయం లో మల్లెమలా టీం అందరికి ఒక కిక్ ఇచ్చే ప్రోమో విడుదల చేసారు. వీరు ఎక్సట్రా జబర్దస్త్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ఆటో రాంప్రసాద్ స్కిట్ చేస్తుండగా గెటప్ శ్రీను వెనకనుంచి ఎంట్రీ ఇచ్చి అందర్నీ సర్ప్రైజ్ చేశాడు. రాంప్రసాద్ డైలాగ్ చెప్తుడగ వెనకనుంచి శ్రీను ని చూసి సర్ప్రైజ్ అయ్యి వెంటనే స్కిట్ ని ఆపేసి తన స్నేహితుడిని హాగ్ చేసుకొని ఎమోషనల్ అయ్యాడు.
ఓ మై ఫ్రెండ్ సాంగ్
రాంప్రసాద్, ఇంద్రజతో ” మేడం శ్రీను వచ్చాడు, స్కిట్ చేద్దామనుకుంటున్నా,. మీరు కాస్త టైం ఇవ్వండి”
అని కోరాడు’. ఫస్ట్ ఈ స్కిట్స్ ప్యాక్ చేసేసి వెళ్లి మా శ్రీనుని తీసుకొచ్చేయండి’ అని ఇంద్రజ చాలా హ్యాపీగా చెప్తుంది. అప్పుడు బ్యాగ్రౌండ్ లో ‘ఓ మై ఫ్రెండ్’ సాంగ్ వేసి ఎమోషనల్ గా టచ్ ఇస్తారు నిర్వాహకులు. అయితే ఇది ఒక స్కిట్ వరకే పరిమితమా? లేక శ్రీను షోలో కంటిన్యూ అవుతాడా? అనేది మాత్రం సస్పెన్స్. ఈ సస్పెన్స్ విడాలంటే ఎక్సట్రా జబర్దస్త్ చూడాల్సిందే.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!