లాక్ డౌన్ సమయంలో తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించని సంస్థల సంస్థలపై కఠిన చర్యలు తీసుకోకుండా సుప్రీం కోర్టు ఒక ఉత్తర్వు ఇచ్చింది.జూన్ పన్నెండు వ తేదీ వరకు ఎవరిపైనా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.ఇంతకు ముందు సుప్రీంకోర్టు మే పదిహేనో తేదీ వరకు అమల్లో ఉండేలా ఈ తరహా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.తాజాగా ఆ ఉత్తర్వులను జూన్ పన్నెండు వ తేదీ వరకు పొడిగించారు.
లాక్ డౌన్ విధించిన వెంటనే కేంద్రం మార్చి 29న జారీ చేసిన సర్క్యులర్ లో పూర్తి జీతాలు ఇవ్వని సంస్ధలపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. లాక్ డౌన్ సమయంలో ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు ఉద్యోగులందరికీ తప్పనిసరిగా పూర్తి జీతం చెల్లించాల్సిందేనని ఆదేశించింది . ఈ సర్క్కులర్ పై కార్పోరేట్ సంస్ధలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇవ్వని సంస్ధలపై బలవంతంగా చర్యలు తీసుకునేందుకు రాజ్యాంగపరంగా అవకాశం లేదని మే 15న తేల్చి చెప్పింది.అందువల్ల చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది
అయితే తర్వాత కేంద్రం ఈ ఆదేశాలను అయితే కేంద్రం ఈ ఆదేశాలను సమీక్షించాలని కోరగా సుప్రీంకోర్టు స్పందిస్తూ మే పదిహేనున తాము ఇచ్చిన ఆదేశాలను జూన్ పన్నెండు వరకూ పొడిగిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులకు పూర్తి జీతం ఇవ్వాలనేది ఎంత ముఖ్యమో సంస్ధలు ఆర్ధికంగా ఇబ్బందులపాలవ్వకుండా మనుగడ సాగించడం కూడా అంతే ముఖ్యమని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.