కేంద్ర ప్రభుత్వం చైనా యాప్స్ పై మరోసారి కొరడా ఝళిపించింది. గతంలో 106 చైనా బేస్డ్ యాప్స్ ను నిషేధించిన కేంద్రం తాజాగా మరోసారి 118 యాప్స్ పై నిషేధాన్ని ప్రకటించింది. అందులో పబ్జీ ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇండియా-చైనా బోర్డర్ వద్ద మరోసారి ఉద్రిక్తతల నేపథ్యంలో పబ్జీ బ్యాన్ అయింది. గత కొంత కాలం నుండి ఈ గేమింగ్ యాప్ ను బ్యాన్ చేయాలన్న డిమాండ్స్ ఎక్కువవుతున్నాయి. యువత ఎక్కువగా ఈ యాప్ కు బానిసలుగా మారుతుండడమే ఈ డిమాండ్స్ కు ప్రధాన కారణం. పబ్జీని దాదాపు 70 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. దాదాపుగా 70 కోట్ల మంది ఈ గేమింగ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడం విశేషం. పబ్జీ యాప్ బ్యాన్ అవ్వడంతో ఈ గేమ్ కు బానిసైన వారందరూ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారని చెప్పవచ్చు.