ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని, ప్రభుత్వం అందించిన ప్రజా ప్రయోజన పథకాలను సరిగ్గా ప్రజలకు అందాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్ ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. దాదాపు నాలుగు లక్షల మంది యువత ఈ వ్యవస్థ వల్ల ఉద్యోగాలు పొందారు.
ఈ గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి రేపటికి ఏడాది పూర్తవుతోంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా రిస్క్ తీసుకుని, కరోనా సమయంలో కూడా సేవలు అందించారు వాలంటీర్లు. వారి విధి నిర్వహణను గుర్తించిన ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రోత్సాహకాలను అందిస్తోన్న విషయం తెల్సిందే. ఇక వాలంటీర్ల సేవలకు ఏడాది గడిచిన సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి ఒక పిలుపునిచ్చారు. రేపు రాత్రి 7 గంటలకు అందరూ చప్పట్లు కొట్టి వారిని ప్రోత్సహించాలని ఆయన కోరారు. 543 రకాల సేవలు ప్రజలకు గ్రామ సచివాలయ వాలంటీర్ల ద్వారా ప్రజలకు అందుతున్నట్లు తెలిపారు.