Gunashekhar : గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా శాకుంతలం. ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని .. అందుకు కారణం ఈ సినిమా దర్శకుడు గుణశేఖర్ కరోనా బారిన పడినట్టు వార్తలు వచ్చాయి. నెలరోజులుగా మళ్ళీ కరోనా తీవ్ర స్థాయిలో ప్రతాపం చూపిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీస్ లో ప్రముఖ సినీ తారలు, దర్శక, నిర్మాతలు కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రూమర్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి.
ముఖ్యంగా ఫేక్ న్యూస్ బాగా క్రియేటయి వైరల్ అవుతున్నాయి. కరోనా రాని వారికి కూడా పాజిటివ్ వచ్చిందంటూ.. సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారంటూ పలు సామాజిక మాధ్యమాలలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ కూడా కరోనా బారిన పడినట్టు వార్తలు వచ్చాయి. సమంత అక్కినేని శకుంతలగా నటిస్తున్న సినిమా ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో గుణ టీం వర్క్స్ పతాకంపై నీలిమ గుణ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
Gunashekhar : గుణశేఖర్ స్పందించాడు..శాకుంతలం సినిమా షూటింగ్ ఆగిపోలేదని తెలిపాడు.
అయితే ఈ సినిమా తాత్కాలికంగా బ్రేక్ పడినట్టు న్యూస్ వచ్చి వైరల్ అయింది. దీంతో దర్శకుడు గుణశేఖర్ స్పందించాడు. కంటిన్యూస్ గా షూటింగ్స్ చేస్తున్న క్రమంలో రెగ్యులర్గా చేయించుకున్నట్టు కరోనా టెస్ట్ చేయించుకున్నానని .. అయితే తనకి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని డాక్టర్ నిర్ధారించినట్టు చెప్పుకొచ్చాడు. అంతేకాదు శాకుంతలం సినిమా షూటింగ్ ఆగిపోలేదని నిర్విరామంగా షూటింగ్ జరపనున్నట్టు తెలిపాడు. ఇక ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!