Peace of mind:మనఃశాంతి Peace of mind నేడు ఉన్న పరిస్థితుల ప్రభావం వలన మనిషి చాల కొంచెం పని చేసినా కూడా వెంటనే నీరసించిపోతున్నాడు. ఆ కోల్ పోయిన శక్తిని మళ్ళీ తిరిగి పొందాలంటే, ధ్యానం ఒక్కటే మార్గమ ని ఆధ్యాత్మిక గురువులు సూచిస్తున్నారు. ధ్యానం మౌనం తో నిండి ఉంటుంది. ఈ మౌనం అనేక శక్తులను కలిగి ఉంది. ముఖ్యంగా వాక్ శక్తి, మానసిక శక్తి అందులోనే కేంద్రీకృతం చేయబడ్డాయి. మౌనం పాటించటంవల్ల ఏకాగ్ర తా శక్తి పెరుగుతుంది. ఏవిధంగానైతే ఎండ లో ఒక భూతద్దం పెట్టి సూర్యకాంతి ని ఒక బిందువు గా ప్రసరింప చేసి ఉంచడం వలన అది వస్తువును సైతం ఎలా కాల్చివేస్తుందో అలాగే వాక్ శక్తి, మానసిక శక్తిని కేంద్రీకరిస్తే ప్రపంచం లో సైతం శాంతి ని నిలిపి ఉంచవచ్చు.
మౌనం వలన మాటలు మృదు మధురంగా పలికే శక్తి లభిస్తుంది. ఆ శక్తి లేకపోతే నాలుక కత్తి కంటే పదునైన దానిగా పనిచేస్తుంది. ఒక రకం గా చెప్పాలంటే మౌనం కూడా ఒక భాషే.. మౌనభాషణ శక్తి వరదాయిని అని చెప్పవచ్చు. ప్రేమామృతం లాంటి మాటలతో ఎలాంటివారినైనా మార్చి వారి జీవితా లను పరిపూర్ణం చేసేవీలుంటుంది .సత్య వచనాలను సైతం ప్రేమపూరితంగానే చెప్పాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ పరుషం గా మాట్లాడ కూడదు. మాట్లాడేది ఆత్మ గాని నోరు కాదు కదా? ఆత్మ శాంతి కాముకమైనది. కాఠిన్యం, అసత్యం వల్ల గందరగోళం, చికాకుఏర్పడతాయి. పరమాత్ముని తో సంబంధం పెట్టుకుంటే ఆత్మ శక్తిని, శాంతి ని పొందుతుంది. అప్పుడు మనం ఏది మాట్లాడి నా విజయవంతమవుతుంది. తక్కువగా మాట్లాడిన మాటలు చాల శక్తి వంతంగావుంటాయి. అవసరమైన ఆలోచన లను అదుపు చేస్తే మనోబలం పెరుగు తుంది.
శరీరం లో ప్రతి అవయవాన్ని విచ్ఛలవిడిగా పోనివ్వ కుండా అదుపు చేసి అంతర్ముఖం చేస్తే ఇంకా శక్తి వంత మైన ఫలితము వస్తుంది. మౌనం, రాజ యోగం ద్వారా శారీరక బలం, ఆధ్యాత్మిక శక్తు లను సంపాదించ వచ్చు. ఈ రెండు శక్తు ల ను సాధించడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. అందుకే రోగులకు మందుల తోబాటు ధ్యానంతోనూ చికిత్స చేస్తే చాలా త్వరగా మంచి ఫలితాలు కలుగుతాయి.