NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అదిరిపోయే ట్విస్ట్‌… భ‌ర్త వైసీపీలో… భార్య టీడీపీలోకి జంప్‌… !

ఏపీలో సాధార‌ణ ఎన్నిక‌ల వేళ రాజ‌కీయం మామూలుగా లేదు. జంపింగ్‌లు జ‌రుగుతున్నా కొన్ని జంపింగుల్లో అదిరిపోయే ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు సతీమణి సుధారాణి నేతృత్వంలో వివిధస్థాయిల వైసిపి నాయకులు యువనేత లోకేష్ సమక్షాన సోమవారం టిడిపిలో చేరారు. 15 మంది సర్పంచులు, 17 మంది ఎంపిటిసిలు, 5గురు కన్వీనర్లతో సహా 150మంది పార్టీ ముఖ్యనేతలు సోమవారం భారీకాన్వాయ్ తో ఉండవల్లిలోని చంద్రబాబు వద్దకు నివాసానికి చేరుకుని టీడీపీ కండువాలు క‌ప్పుకున్నారు.

Husband joins YCP... Wife jumps to TDP..
Husband joins YCP… Wife jumps to TDP..

ఇంకా చెప్పాలంటే ఓ ఎమ్మెల్సీ భార్య‌తో పాటు ఈ స్థాయిలో ఎంపీటీసీలు, స‌ర్పంచ్‌లు పార్టీ మారిపోయారంటే నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ చాలా వ‌ర‌కు ఖాళీ అయిపోయింద‌నే చెప్పాలి. టీడీపీలో చేరిన వారిలో ఎస్.కోట ఎంపీపీ సంధి సోమేశ్వరరావు, ఎంపీటీసీ లాగుడు లక్ష్మి, ఎంపీటీసీ మోపాడ గౌరీశ్వరి, ఎంపీటీసీ-1 దారా గిరి, ఎంపీటీసీ-2 మజ్జి దేవి, ఎంపీటీసీ-4 వాకాడ సింహాచలం, ఎంపీటీసీ-5 మోపాడ సునీత, ఎంపీటీసీ-6 బి.ఆదిలక్ష్మి, ఎంపీటీసీ భోజంకి వెంకటలక్ష్మి, మండల కో-ఆప్షన్ మెంబర్ షేక్ బషీర్, సర్పంచ్ లు సోలుబొంగు కనకం, రామకృష్ణ, సంతోషి కుమారి, వొబ్బిన త్రినాథమ్మ, లాగుడు సూర్యనారాయణ, ఎర్ర సన్యాసిరావు తదితరులు ఉన్నారు.

పార్టీలో చేరిన ఎమ్మెల్సీ ర‌ఘురాజు భార్య సుధారాణి వైసీపీపై తీవ్ర‌స్థాయిలో విరుచుకు ప‌డ్డారు. ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నియోజకవర్గాన్ని కబ్జాల కోటగా మార్చేశారని… వైసీపీలో ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మాకు అక్కడ ఎలాంటి ఆత్మగౌరవం లేదు. మా సమస్యలను జగన్ రెడ్డి ఏనాడూ పట్టించుకోలేదు. నియోజకవర్గ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు కబ్జాల కడుబండిగా పేరు గడించారు.. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి ఇక్కడకు వచ్చాం. ఇక్కడ కార్యకర్తలకు గౌరవం ఉంటుంద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యానికి, చంద్ర‌బాబు నాయుడు గారిని ముఖ్య‌మంత్రిని చేసేందుకు మ‌న‌స్ఫూర్తిగా ప‌నిచేస్తామ‌ని చెప్పారు.

Husband joins YCP... Wife jumps to TDP..
Husband joins YCP… Wife jumps to TDP..

ఏదేమైనా ఎస్ కోట‌లో ఇది వైసీపీకి భారీ షాక్‌గా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ఎస్ కోట విశాఖ‌ప‌ట్నం పార్ల‌మెంటు ప‌రిధిలో ఉంది. ఇక ఎస్ కోట టీడీపీ టిక్కెట్ కోసం మాజీ ఎమ్మెల్యే, ప్ర‌స్తుత‌ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కోళ్ల లలితకుమారి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ పోటీప‌డుతున్నారు. ఈ చేరిక‌లు ఇక్క‌డ టీడీపీలో మామూలు ఉత్సాహం నింప‌లేద‌నే చెప్పాలి.

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju