కుని శస్త్ర చికిత్సలకు టార్గెట్ లు సరికాదని తెలంగాణ గవర్నర్ తమిళి సై అన్నారు. తెలంగాణలోని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల కుటుంబ నియంత్రణ చికిత్సలు వికటించి నలుగురు మహిళలు మృతి చెందడం, మరి కొందరు మహిళలు ఇన్పెక్షన్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని రేపింది. వైద్యులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఘటనపై విచారణకు ఆదేశించింది. పలువురు మహిళలు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ డాక్టర్ తమిళి సై .. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను పరామర్శించారు.
ఈ సందర్భంగా డాక్టర్ తమిళి సై మాట్లాడుతూ ఇలా కుటుంబ నియంత్రణ చికిత్సలు వికటించి మహిళలు చనిపోవడం మామూలు విషయం కాదని, ఆమోద యోగ్యం కాదని అన్నారు. దీనిపై విచారణ జరుగుతోందని చెప్పారు. త్వరగా ఎక్కువ ఆపరేషన్లు చేయాలన్న టార్గెట్ (లక్ష్యం), ఆ సమయంలో ఇన్ఫెక్షన్ వల్లే కు ని చికిత్సలు వికటించి మహిళలు చనిపోయి ఉంటారని ఒక వైద్యురాలిగా తాను భావిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ నియంత్రణ చికిత్సలకు అంటే మరింత మంది ముందుకు వచ్చేలా చైతన్య పర్చాలే కానీ ఎక్కువ ఆపరేషన్లు చేయాలన్న టార్గెట్ లు సరికాదని అన్నారు. శస్త్ర చికిత్సల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలను మెరుగుపర్చాలని ప్రభుత్వానికి లేఖ రాస్తానని గవర్నర్ తెలిపారు. నిమ్స్ లో జరుగుతున్న వైద్య సౌకర్యాలపై బాధితులు సంతృప్తికరంగా ఉన్నారని చెప్పారు. బాధితులు ఆర్ధిక సహాయం కోరుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని గవర్నర్ తమిళి సై తెలిపారు.
విమానంలో ప్రయాణీకుడికి అత్యవసర వైద్యసేవలు అందించి మానవత్వాన్ని చాటుకున్న తెలంగాణ గవర్నర్ తమిళి సై