కాలం మారుతున్న కొద్ధి జీవన శైలీలోనూ మార్పులు వచ్చాయి. రైయ్ రైయ్ మంటూ దూసుకుపోతున్న ఈ ఆధునిక పోకడల నేపథ్యంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. మరీ ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పులు భారీగానే వచ్చాయి. దీని కారణంగా వచ్చే వ్యాధుల ప్రభావం సైతం పెరిగింది. ఇటీవల కరోనా వైరస్ విజృంభణ కారణంగా చాలా మంది దీని బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ప్రధానంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నావారిలో ఈ వైరస్ తీవ్రమైన అనారోగ్య సమస్యలను సృష్టించడంతో పాటు ప్రాణాలను కూడా బలితీసుకున్నది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం చాలా మంది రోగ నిరోధక శక్తిని (ఇమ్యూనిటీ పవర్) పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడంలో కొందరు ఆసక్తి చూపిస్తుండగా, మరికొందరు ఔషధాలు, ఇతర మందులను తీసుకుంటున్నారు. అయితే, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి కృత్రిమ మందులను ఎక్కుగా తీసుకోవడం వల్ల కూడా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశమూ లేకపోలేదని వైద్యులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దీంతో చాలా మంది సహజ సిద్ధంగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం మంచిదనే అభిప్రాయానికి వచ్చారు. దీందో సహాజ సిద్ధంగా తయారు చేయబడిన ఔషధాలు తీసుకోవడం ఎంతో మేలని భావిస్తున్నారు. అయితే, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంలో ఈ ఔషధానికి మించినది మరోకటి లేదని మన ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలు చేబుతున్నాయి. ఆ ఔషధం ఏంటనే? కదా మీ ప్రశ్న! అక్కడికే వస్తున్న ఉండండి..! ఆ ఔషధం పేరే మహా సుదర్శన చూర్ణం. పేరుకు తగ్గట్టుగానే ఈ ఔషధం రోగ నిరోధక శక్తిని పెంపొందిచడంలో తిరుగులేకుండా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యులు పేర్కొంటున్నారు.
ఈ మహాసుదర్శన చూర్ణాన్ని పలు రకాల మూలికలను కలిపి తయారు చేస్తారు. ఆ మూలికలే నేలవేము (మహాతిక్క), తిప్పతీగ, చిత్రమలము, తుంగమస్తల, త్రిఫల, త్రికాటు మొదలైన 56కు పైగా మూలికను కలిపి ఈ ఔషధాన్ని తయారుచేస్తారు. దీనిని తీసుకోవడం ద్వారా చాలా రకాల అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. అలాగే, దూరం చేస్తాయి కూడాను. అన్ని రకాల జ్వారాలను, కాలేయ, మూత్రపిండ సంబంధ వ్యాధులను దరిచేరనివ్వదు. ఈ మహాసుదర్శన చూర్ణాన్ని శరీర నిర్మాణ, తత్వాలను అనుసరించి మూడు రూపాల్లో తీసుకోవాల్సి ఉంటుంది.