ఇండియా, చైనా మధ్య తాజాగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ భారత సైన్యం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. 89 మొబైల్ యాప్స్ వినియోగంపై ఆంక్షలు విధిస్తూ సైన్యం ఉత్తర్వులు జరీ చేసింది. సైన్యంలో పనిచేసే సిబ్బందికి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
సైన్యం ఆంక్షలు విధించిన యాప్స్ లో ఫేస్ బుక్, టిక్ టాక్, ట్రూ కాలర్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్రముఖ యాప్స్ ఉన్నాయి. ఈ ఆంక్షలు విధించడం వెనకున్న ముఖ్య ఉద్దేశం సైనిక సమాచారం లీకవ్వకుండా చూడటం కోసమేనని తెలుస్తోంది. అయితే ఈ యాప్స్ లో భారత ప్రభుత్వం టిక్ టాక్ ను ఇప్పటికే బ్యాన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే.