Drugs: మన దేశంలో ఎక్కువమంది యువత డ్రగ్స్ కి అలవాటు పడి తమ జీవితాలను ఇరకాటంలో పడేస్తున్నారు. ఒక్కసారి ఆ ఊబి లో వెళ్తే ఇంకా మునిగిపోవడం తప్ప బయటపడే మార్గాలు చాలా తక్కువ. ఒక్కసారి అందులోకి వెళితే అందులో నుంచి బయటకు రావడానికి కూడా ఆసక్తి చూపించరు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి కొన్ని కోట్ల మంది డ్రగ్స్ కి బానిస అయిపోతున్నారు.
మద్యం వంటివి సేవిస్తే ఆ మత్తు ఎక్కడానికి కొంచెం సమయం పడుతుంది. అదే డ్రగ్స్ తో అయితే వెంటనే ఆ మత్తు ప్రపంచంలో తేలిపోవచ్చు అన్న ఉద్దేశంతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని తెలిసినా డ్రగ్స్ ని తీసుకోవడం మానడంలేదు. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం మరీ ఎక్కువ అవ్వడంతో ప్రపంచంలో అత్యధికంగా డ్రగ్స్ తీసుకుంటున్న దేశం ఏదని సర్వే చేపట్టగా అందులో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇండియా లో డ్రగ్స్ వినియోగం ఏ స్థాయిలో ఉందో ఇటీవల నార్కోటిక్స్ సెంట్రల్ బ్యూరో చేపట్టిన దివంగత సుశాంత్ సింగ్ రాజపుట్ హత్య కేసు విచారంలో బాలీవుడ్ ఉదంతం అధికారికంగా బయట పెట్టింది. జర్మనీకి చెందిన ఓ ప్రముఖ ఏబీసీడీ అనే సంస్థ ఈ విషయమై సర్వే చేపట్టగా ఆ నివేదిలో ప్రపంచంలో అత్యధికంగా డ్రగ్స్ తీసుకుంటున్న నగరాల్లో మొదటి స్థానంలో అమెరికాలోని న్యూయార్క్ ఉందట. ఈ సర్వే ప్రకారం న్యూ యార్క్ లో ఏటా దాదాపు 70 వేల 252 కేజీల డ్రగ్స్ ను ప్రజలు వినియోగిస్తున్నారని తేలింది.
ఇక ఈ జాబితాలో పాకిస్థాన్ రెండవ స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ లోని కరాచీలో సంవత్సరానికి 38 వేల 56 కేజీల డ్రగ్స్ ను అక్కడి ప్రజలు వినియోగిస్తాన్నారట.
ఇక మూడవ స్థానంలో ఇండియా నిలిచింది. ఢిల్లీలో ఏడాదికి 34 వేల 708 కేజీల డ్రగ్స్ ను ప్రజలు వినియోగిస్తున్నట్లు సమాచారం. ఇవి కేవలం అధికారిక లెక్కలు మాత్రమే. మరి అనధికారంగా ఇంకెన్ని కేజీలో!!!