అక్కినేని వారి కోడలు టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ‘ఆహా’ ఓటీటీలో ‘సామ్ జామ్’ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకి చాలా మంది ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలు వస్తున్నారు. కొద్ది కాలం క్రితం ప్రారంభమైన ఈ షో.. ప్రేక్షక ఆదరణ ప్రస్తుతం బాగా దక్కించుకుంది. ముఖ్యంగా సమంత కెరియర్లో ఇది మొట్టమొదటి టాక్ షో అయినా గాని.. హోస్ట్ గా సమంత చాలా మందిని ఆకట్టుకుంటుంది.
అంతకుముందు బిగ్గ్ బాస్ సీజన్ ఫోర్ లో దసరా పండుగ నేపథ్యంలో రెండు ఎపిసోడ్లు చేసినా గాని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ‘ఆహా’ ఓటీటీలో ‘సామ్ జామ్’ షో లో సమంత బాగా రాణిస్తోంది. సెలబ్రిటీలను ఆకట్టుకునే రీతిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా ప్రశ్నలు వేస్తూ షోలో నవ్వులు పూయిస్తుంది. మొత్తం 10 ఎపిసోడ్ లకు ప్లాన్ చేయగా 8 ఎపిసోడ్ల తోనే ముగిస్తుంది.
కాగా చివరి ఎపిసోడ్లో సమంత తన భర్త నాగచైతన్యని ఇంటర్వ్యూ చేయనుంది. ఫస్ట్ ఎపిసోడ్ కి విజయ్ దేవరకొండ, సెకండ్ ఎపిసోడ్ రానా రావటం జరిగింది. ఇక మూడవ ఎపిసోడ్లో బ్యాడ్మింటన్ దంపతులు పారుపల్లి కశ్యప్-సైనా నెహ్వాల్ నాలుగో ఎపిసోడ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా పాల్గొన్నారు. ఎపిసోడ్ 5కు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ హాజరయ్యారు. 6వ ఎపిసోడ్ లో మెగాస్టార్ చిరంజీవి అలరించగా.. 7వ ఎపిసోడ్ కు అల్లు అర్జున్ విచ్చేశారు. ఇదిలా ఉంటే ఒక ఎపిసోడ్ కి 15 లక్షల చొప్పున మొత్తంగా 1.5 కోట్లు రెమ్యునిరేషన్ ఈ టాక్ షో కి సామ్ తీసుకున్నట్లు వార్తలు రావడంతో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడి నట్లయింది. కరోనా లాంటి కష్టకాలంలో సమంత భలే తన కెరియర్ కొనసాగిస్తోంది అన్న టాక్ వినబడుతోంది.