శ్రీనగర్, జనవరి 22: దక్షిణ కాశ్మీర్లోని షుప్లాన్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒకరు ఒక ఐపిఎస్ అధికారి సోదరుడు కూడా ఉన్నారు. ఈ ఎన్కౌంటర్లో భద్రతా దళాలు తీవ్రవాదుల రహస్య స్థావరాలను ధ్వంసం చేశారు. ఐపిఎస్ ఆధికారి సోదరుడు అయిన షంషూల్ హక్ డిగ్రీ పూర్తి అయిన తరువాత హిజ్బుల్ ముజహూద్దీన్ తీవ్రవాద వర్గంలో చేరాడు. తీవ్రవాద గ్రూపులో చేరిన తన సోదరుడిని తిరిగి రప్పించడానికి తాను, తన కుటుంబ సభ్యులు శాయశక్తులా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఎస్పి వైద్ ట్విటర్లో పేర్కొన్నారు
previous post