మహానటి ఫేం తో కీర్తి సురేష్ అంగీకరించిన సినిమాలలో మూడు సినిమాలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలే ఉండటం చూసి అందరూ షాకయ్యారు. అరుంధతి సినిమా తర్వాత అనుష్క ఎలా దూకుడుగా వ్యవహరించిందో అలాగే కీర్తి కూడా వరస ప్రాజెక్ట్స్ లో క్షణం తీరిక లేనంత బిజీగా మారిపోయింది. అయితే ఇప్పుడు కీర్తి కి కాస్త మైనస్ అయింది అంటే కరోనా కారణంగా తన సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేయాల్సి రావడం.
సినిమాని థియోటర్స్ లో చూసిన ఫీల్ ఖచ్చితంగా ఓటీటీలో ఉండదు. ఆ ప్రభావమా లేదా కథలో పట్టు లేకపోవడమా అన్నది చూస్తే ఖచ్చితంగా కథ గురించే అందరూ మాట్లాడతారు. ఓటీటీ అయినా కథ బావున్న కొన్ని చిన్న సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. రీసెంట్ గా వచ్చిన రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా, కలర్ ఫోటో లాంటి సినిమాలు అద్భుతమైన సక్సస్ అందుకొని టాలీవుడ్ ప్రముఖుల తో ప్రశంసించబడుతున్నాయి.
కాని స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళంలో విపరీతమైన క్రేజ్ ఉన్న కీర్తి సురేష్ నటించిన సినిమాలు మాత్రం అనూహ్యంగా భారీ అంచనాల మధ్య రిలీజై ఫ్లాప్ అన్న టాక్ ని తెచ్చుకున్నాయి. ఇంతకముందు పెంగ్విన్ సినిమాని భారీ అంచానాలతో బాగా ప్రమోషన్స్ నిర్వహించి రిలీజ్ చేస్తే ఎవరిని ఆకట్టుకోలేకపోయింది. ఇక తాజాగా మిస్ ఇండియా సినిమా కూడా పరాజాయాన్ని మూటగట్టుకుంది అంటున్నారు.
ముఖ్యంగా ఆకట్టుకునే కథ లేకపోవడమే ఈ రెండు సినిమాలు ఫ్లాపవడానికి ముఖ్య కారణం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఇలాంటి సినిమాలు చేసి కీర్తి తన కెరీర్ ని ఇబ్బందులో పడేసుకుంటే పూజా హెగ్డే, రష్మిక మందన్న లాంటి వాళ్ళ ని తట్టుకొని నిలబడడం కష్టమన్న మాట వినిపిస్తోంది. ఏదేమైనా ఇకపై కీర్తి సురేష్ కథ విషయంలో ఎంతో జాగ్రత్త వహించాల్సిందే అంటున్నారు అభిమానులు.