ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఎన్నికైన నాటినుండి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ పాలన సాగిస్తున్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరిగా ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి సరిగ్గా మళ్లీ ఎన్నికలు వస్తుందనగా ఆరు నెలల ముందు హామీలు అమలు చేసే విధంగా కాకుండా అధికారంలోకి వచ్చిన తొలి నుండే ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తున్నారు జగన్. దాదాపు ఏడాదిలోనే 90 శాతానికి పైగా మేనిఫెస్టోలో ఉన్న అంశాలను హామీలను జగన్ సర్కార్ అమలు చేయడం జరిగింది. కేవలం ఇచ్చిన హామీలను మాత్రమే కాకుండా కొత్త కొత్త సంక్షేమ పథకాలు కూడా ప్రకటిస్తూ సరి కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
కరోనా లాంటి కష్ట సమయాల్లో కూడా సంక్షేమ పథకాలు ఎక్కడ ఇవ్వకుండా జగన్ సర్కార్ అవలంభించిన తీరు కి ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే వైయస్సార్ చేయూత, జగనన్న వసతి దీవెన, ఇంకా పలు సంక్షేమ కార్యక్రమాలు ఇటీవల ప్రకటించిన జగన్ రాబోయే రిపబ్లిక్ డే నాడు మరో హామీని నెరవేర్చే దిశగా జగన్ సంచలన ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. మేటర్ లోకి వెళ్తే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని మరో జిల్లాగా మారుస్తాను అంటూ హామీ ఇవ్వడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాబోయే గణతంత్ర దినోత్సవం నాడు ఈ హామీని నెరవేర్చ డానికి జగన్ డిసైడ్ అయినట్లు వైసిపి పార్టీ లో టాక్ నడుస్తుంది. అయితే 25 జిల్లాలు గా కాకుండా 26 జిల్లాలుగా ప్రకటించే యోచనలో జగన్ సర్కార్ ఉన్నట్లు సమాచారం. అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి సరైన క్లారిటీ లేకపోవడంతో పైగా అది గిరిజన ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో… మొత్తం ఇరవై ఆరు జిల్లాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వచ్చే రిపబ్లిక్ డే దినోత్సవం నాడు జగన్ ప్రకటించబోతునట్లు సమాచారం.