యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ లో కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. పాన్ ఇండియా కేటగిరీలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో బాలీవుడ్, హాలీవుడ్ నటీ, నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక 80 శాతం పూర్తయిన ఈ సినిమాని త్వరలో సెట్స్ మీదకి తీసుకు వెళ్ళబోతున్నాడు రాజమౌళి.
ఈ సినిమాతో పాటే త్రివిక్రం సినిమాని మొదలు పెట్టి దాదాపు రెండు సినిమాలని ఒకేసారి రిలీజ్ చేయాలని ప్లాన్స్ వేసుకున్నాడు ఎన్.టి.ఆర్. కాని లాక్ డౌన్ కారణంగా రెండు సినిమాలు డిలే అవుతూ వచ్చాయి. ఎట్టకేలకి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలవబోతున్న నేపథ్యంలో త్రివిక్రం సినిమాని మొదలు పెట్టాలని ఎన్.టి.ఆర్ చూస్తున్నాడని తాజా సమాచారం. అందుకే పక్కా ప్రణాళిక తో షెడ్యూల్స్ ప్లాన్ చేయమని త్రివిక్రం కి ఎన్.టి.ఆర్ చెప్పినట్టు తెలుస్తుంది.
అందుకు కారణం ఇప్పటికే అనుకున్న రెండు ప్రాజెక్ట్స్ రిలీజ్ కి లేటవడం ఒకటయితే కే.జీ.ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఎన్.టి.ఆర్ సినిమా కూడా చేయాల్సిన కమిట్మెంట్ ఉండటం మరో కారణం. అందుకే త్రివిక్రం మీద ఒత్తిడి తెస్తున్నాడని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు గాని మొత్తాని ఎన్.టి.ఆర్ వరసగా మూడు పాన్ ఇండియా సినిమాలని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మాత్రం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
ఇక ఆర్ ఆర్ ఆర్ నుంచి ఎన్.టి.ఆర్ వీడియో టీజర్ కోసం అభిమానుల తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాని రాజమౌళి మాత్రం అందుకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఇవ్వలేకపోతున్నారు. అయితే ఖచ్చితంగా కొమరం భీం గా ఎన్.టి.ఆర్ మాత్రం అదరగొట్టడం ఖాయమని అంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!