గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సీటిమార్ సినిమాలో చేస్తున్నాడు. క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇంతక ముందు సంపత్ నంది గోపీచంద్ కాంబినేషన్ లో ‘గౌతమ్ నంద’ వచ్చి డిజాస్టర్ గా మిగిలింది. దాంతో ఈ సినిమాతో గోపీచంద్ కి భారీ సక్సస్ ఇవ్వాలని కసిగా ఆ ఉన్నాడు సంపత్ నంది. ఇక సంపత్ నంది, తమన్నా లకి సీటీమార్ హ్యాట్రిక్ సినిమా. సీటిమార్ సినిమా తర్వాత తేజ దర్శకత్వంలో లో ‘అలిమేలుమంగ వేంకటరమణ’ అనే సినిమాను చేసేందుకు గోపిచంద్ కమిటయ్యాడు. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి తీసుకు వెళ్ళేందుకు తేజ సన్నాహాలు చేస్తున్నట్టు తాజా సమాచారం.
అయితే ఈ సినిమాలో అలిమేలుమంగ పాత్ర ఏ హీరోయిన్ చేస్తుందన్న క్లారిటీ ఇప్పటి వరకు రాలేదు. దర్శకుడు తేజ ముందు కాజల్ ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట. అందుకు కారణం తేజ కి కాజల్ కి మంచి బాండింగ్ ఉండటమే. అదీకాకా తేజతో ఇప్పటికే మూడు సినిమాలు చేసింది కాజల్. కాని ఎందుకనో కాజల్ కాకుండా కీర్తి సురేష్ – సాయి పల్లవి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే సాయి పల్లవి ప్రస్తుతం విరాట పర్వం తో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న లవ్ స్టోరీ అన్న సినిమా చేస్తుంది. అలాగే నాని సినిమా కూడా కమిటయినట్టు సమాచారం. వీటితో పాటు తమిళ సినిమాలు చేతిలో ఉన్నాయట. ఇక కీర్తి సురేష్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. అందుకే మళ్లీ కాజల్ అగర్వాల్ అయితేనే బెటర్ అని తేజ ఫిక్స్ చేసినట్లు సమాచారం. మరి కాజల్ అగర్వాల్ ఫైనల్ అయిందా లేక కీర్తి సురేష్ ఫైనల్ అయిందా తెలీదు గాని ఈ ఇద్దరి పేర్లు మాత్రం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక తేజ రానా దగ్గుబాటి తోను ఒక సినిమా మొదలు పెట్టబోతున్నాడు. ఇంతక ముందు ఈ ఇద్దరి కాంబినేషన్ లో నేనే రాజు నేనే మంత్రి వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!