స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘1-నేనొక్కడినే’ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్. సుకుమార్ – మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఫ్లాపవడంతో ఇక టాలీవుడ్ లో అవకాశాలు అందుకోవడంలో కృతి సనన్ కూడా విఫలమయింది. మొదటి సినిమాతో మంచి పర్ఫార్మర్ అనిపించుకున్నప్పటికి టాలీవుడ్ లో ఉన్న కొన్ని లెక్కల కారణంగా మళ్ళీ వరసగా అవకాశాలు దక్కలేదు.
కాని ఒకే ఒక్క సినిమా అవకాశం వచ్చినప్పటికి ఫస్ట్ సినిమా సీన్ మళ్ళీ రిపీటయింది. అక్కినేని నాగచైతన్య నటించిన ‘దోచెయ్’ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ వచ్చినా కూడా ఆ సినిమా కూడా ఘోరంగా ఫ్లాపవడం కృతి సనన్ కి పెద్ద మైనస్ అయింది. ఇలా టాలీవుడ్ లో వరసగా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ కృతి సనన్ టాలీవుడ్ కెరీర్ ని క్లోజ్ చేసింది.
కాని బాలీవుడ్ లో మాత్రం ఈ బ్యూటీ లక్కీ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది. టాలీవుడ్ కి కంప్లీట్ రివర్స్ లో బాలీవుడ్ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అక్కడ వచ్చిన వరుస ఆఫర్స్ తో కృతి సనన్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్, టైగర్ ష్రాఫ్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్, రాజ్ కుమార్ రావ్, ఆయుష్మాన్ ఖురానా, అర్జున్ కపూర్, కార్తీక్ ఆర్యన్ లాంటి స్టార్స్ కి జంటగా నటించి స్టార్ హీరోయిన్ గా పాపులారిటీని సంపాదించుకుంది. ‘హీరోపంటి’ ‘దిల్ వాలే’ ‘లూకా చుప్పి’ ‘బరేలీకి బర్ఫీ’ ‘పానిపట్’ ‘హౌస్ ఫుల్ 4’ సినిమాలు కృతి సనన్ కెరీర్ లో భారీ సక్సస్ లు గా మిగిలాయి.
కాగా కృతి సనన్ ప్రస్తుతం అక్షయ్ కుమార్ కి జంటగా ‘బచ్చన్ పాండే’ సినిమాలో నటించబోతుంది. 2021 జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవబోతుంది. అయితే టాలీవుడ్ లో పాపులారిటీ సాధించలేకపోవడం తో ఇప్పుడు కృతి సనన్ దృష్ఠి మొత్తం టాలీవుడ్ మీద పడిందట. అవకాశం రావాలే గాని ఎటువంటి హీరో తో అయిన నటించడానికి రెడీగా ఉందట. యంగ్ హీరో కాదు సీనియర్ హీరో సినిమాలో అవకాశం వచ్చినా వదిలే ప్రసక్తే లేదని స్ట్రాంగ్ గా ఫిక్సైందట. చూడాలి మరి తెలుగు సినిమా అవకాశం వస్తుందో లేదో.