Nidhi agarwal : నిధి అగర్వాల్కి మరో భారీ బడ్జెట్ సినిమాలో అవకాశం దక్కినట్టు న్యూస్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. సవ్యసాచి, మిస్టర్ మజ్ఞు సినిమాలతో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న నిధి అగర్వాల్ ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ని చూసి తమిళ సినిమాలలో వరసగా అవకాశాలు దక్కాయి. అక్కడ ఎంట్రీ ఇచ్చిన నిధి యంగ్ హీరోలు జయం రవి, శింబు సినిమాలలో నటించి హిట్స్ అందుకుంది.
ప్రస్తుతం కోలీవుడ్ లో ఈ ఇస్మార్ట్ బ్యూటీకి బాగానే ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఈ క్రమంలో మరికొన్ని తమిళ సినిమాలకి సైన్ చేసిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే టాలీవుడ్ లో గొప్ప అవకాశం అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరల్లు సినిమాలో నటిస్తుండటమే. ఈ సినిమాలో నిధికి అవకాశం దక్కుతుందని ఏ ఒక్కరు ఊహించలేదు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్లో స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో హింట్ ఇచ్చారు.
Nidhi agarwal : రానా సినిమాలో నిధికి అవకాశం దక్కితే ఇక టాలీవుడ్ లో సెటిలయినట్టే.
దాంతో అందరూ హరిహర వీరమల్లు సినిమాతో నిధి అగర్వాల్ స్టార్ హీరోయిన్ అయినట్టే అని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ లో నిధి అగర్వాల్ కి మరొక గోల్డెన్ ఛాన్స్ వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. రానా దగ్గుబాటి హీరోగా స్టార్ డైరెక్టర్ ప్లాన్ చేస్తున్న భారీ బడ్జెట్ సినిమాలో నిధి అగర్వాల్ ని హీరోయిన్ గా ఎంపిక చేసుకోవాలని చూస్తున్నారట. ఇటీవల రానా అరణ్య సినిమాతో వచ్చి ఆకట్టుకున్నాడు. ఇక ఈ నేలాఖరున విరాట పర్వం సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి, ప్రియమణి హీరోయిన్స్ గా నటించారు. కాగా రానా నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. నిజంగా రానా సినిమాలో నిధికి అవకాశం దక్కితే ఇక టాలీవుడ్ లో సెటిలయినట్టే.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!