Nithin : నితిన్ కి టాలీవుడ్ లో యూత్ స్టార్ గా అందరిలోనూ ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. గత ఏడాది ‘భీష్మ’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నితిన్ వరసగా నాలుగు ప్రాజెక్ట్స్ని లైన్లో పెట్టాడు. ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ కూడా అయ్యాయి. గత ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ కరోనా కారణంగా నితిన్ అనుకున్న ప్లాన్స్ అన్నీ మారిపోవడంతో.. ఈ ఏడాదిలో మూడు సినిమాలతోనైనా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకున్నాడు. ఇప్పటికే ‘చెక్’, ‘రంగ్ దే’ సినిమాలు నితిన్ నుంచి వచ్చాయి. అయితే ‘చెక్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేక చతికిల పడింది. ‘రంగ్ దే’ మాత్రం హిట్ లిస్ట్ లో చేరింది.
ప్రస్తుతం నితిన్ ‘మాస్ట్రో’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘అంధాదున్’ సినిమా తెలుగులో అఫీషియల్గా రీమేక్ చేస్తున్నారు. ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రల్లో నటించగా బాలీవుడ్ లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దాంతో ఈ సినిమాని టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ రీమేక్ చేయాలని డిసైడయ్యాడు. మాస్ట్రో గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హాట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా టబు పాత్రలో నటిస్తోంది.
Nithin : నితిన్ వక్కంతం వంశీ చెప్పిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
అయితే నితిన్ కమిటయిన సినిమాలలో పవర్ పేట కూడా ఉన్న సంగతి తెలిసిందే. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఈ సినిమా క్యాన్సిల్ అయిందని తాజాగా న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ మేకర్స్ నుంచి మాత్రం అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. అయితే ఇటీవలే రంగ్ దే ప్రెస్మీట్ లో నితిన్ పవర్ పేట సినిమా చేయాల్సి ఉందని చెప్పుకొచ్చాడు. మరి ఇంతలోనే ఈ న్యూస్ ఎందుకు స్ప్రెడ్ అవుతుందన్నది మాత్రం అర్థం కాకుండా ఉంది. ఇక రీసెంట్ గా నితిన్ వక్కంతం వంశీ చెప్పిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!