Shakuntalam : గుణశేఖర్ కెరీర్లో అత్యంత వేగంగా పూర్తి చేస్తున్న సినిమా శాకుంతలమేనా అని ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఆయన సినిమాలకి వేసే సెట్స్ కోసమే చాలా సమయం కేటాయిస్తారు. భారీ సెట్స్తో ఆయన మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, అనుష్క లాంటి వారితో తీసిన చూడాలని ఉంది, మృగరాజు, ఒక్కడు, అర్జున్, సైనికుడు, రుద్రమదేవి లాంటి సినిమాలు మేకింగ్కి బాగానే సమయం పట్టింది. కానీ, ఇప్పుడు చేస్తున్న పాన్ ఇండియన్ సినిమా శాకుంతలం మాత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు.
ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ ఇలా వచ్చి అలా చక చకా షూటింగ్ పూర్తి చేసింది. ఈ బుల్లి స్టార్కి ఘనంగా వీడ్కోలు పలికింది శాకుంతలం చిత్రబృందం. ఇప్పుడు అక్కినేని సమంతకి అలాగే గ్రాండ్గా వీడ్కోలు చేప్పారు గుణశేఖర్ బృందం. సమంత – మలయాళ నటుడు దేవ్ మోహన్ జంటగా నటిస్తున్న పౌరాణిక గాధ శాకుంతలం. కావ్య నాయకి శకుంతల, ఆమె ప్రియుడు దుష్యంతుడుగా దేవ్ మోహన్ నటిస్తుండగా వారి కొడుకు భరతగా అల్లు అర్హ నటించింది. అద్భుతమైన దృశ్య కావ్యంగా గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.
Shakuntalam : శాకుంతలం కోసం గుణశేఖర్కి బల్క్ డేట్స్ ఇచ్చింది సమంత
కాగా గురువారం (ఆగస్ట్ 12)తో ఇందులో శకుంతలగా నటిస్తున్న సమంత, తన పాత్రకి సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేసేసింది. ఈ సినిమా కోసం మరే కొత్త ప్రాజెక్ట్ కమిటవకుండా గుణశేఖర్కి బల్క్ డేట్స్ ఇచ్చింది. ఆ రకంగా సమంత శాకుంతలం పూర్తి చేసేసింది. దాంతో చిత్రబృందం సమంతకి ఘనంగా వీడ్కోలు తెలిపింది. ఇక ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న నీలిమ గుణ సమంతకి సర్ప్రజింగ్ గిఫ్ట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక శాకుంతలం సినిమాను సమర్పిస్తున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు స్వయంగా సమంతకి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ విషయాన్ని చిత్ర బృందం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!