80, 90 లలో స్టార్ హీరోయిన్స్ గా చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్స్ అందరూ దాదాపు పెళ్ళి చేసుకొని సెటిలై సినిమాలకి కొంతకాలం దూరమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో మళ్ళీ సినిమాలలో ఎంట్రీ ఇచ్చి అత్తగా, అమ్మగా అద్భుతమైన పాత్రలు పోషిస్తూ సక్సస్ ఫుల్ గా కొనసాగుతున్నారు. అలాంటి వాళ్ళ లో రమ్యకృష్ణ ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బాహుబలి ఫ్రాంఛైజీ లో శివగామి పాత్రలో అద్భుతంగా నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.
అయితే కొంతమంది స్టార్ హీరోయిన్స్ మాత్రం కెరీర్ లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక పెద్ద డైలమాలో పడుతున్నారు. టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించిన అనుష్క శెట్టి ప్రస్తుతం ఇలాంటి డైలమాలోనే ఉన్నట్టు తెలుస్తుంది. తనకి మంచి అవకాశాలు రావడం లేదన్న మాట వినిపిస్తుంది.
ఇటీవల స్నేహ ,భూమిక వంటి వారు కొన్ని సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపించారు. ప్రియమణి అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా హీరోయిన్ గా నటిస్తుండటం షాకింగ్ విషయం. వెంకటేష్ నటిస్తున్న నారప్పలో హీరోయిన్ గా, అలాగే రానా నటిస్తున్న విరాట పర్వం లో ఒక హీరోయిన్ గా నటిస్తుంది. కాని అనుష్క మాత్రం ఒక సినిమా కమిటవ్వాలన్న వచ్చిన అవకాశాన్ని ఒప్పుకోవాలన్నా ఆలోచిస్తుందట.
ఒకటి రెండు ఏళ్ళ తేడాతో అనుష్క తో పాటు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్ కి కూడా చేతి నిండా సినిమాలున్నాయి. వెబ్ సిరీస్ లో ఛాన్స్ వచ్చినా వదలడం లేదు. కాని అనుష్క పరిస్థితే అర్థం కావడం లేదని అంటున్నారు. బాహుబలి ఫ్రాంఛైజీలో దేవసేనగా నటించిన అనుష్క క్రేజ్ ఒక్కసారిగా ఇలా తగ్గడం ఏంటీ అని ఫ్యాన్స్ తల బద్దలు కొట్టుకుంటున్నారట.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!