హైదరాబాద్ నగరంలోని యశోద ఆసుపత్రిలో అదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఏకకాలంలో 20 బృందాలు ఇటు ఆసుపత్రి, అటు ఆసుపత్రి డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగిస్తున్నారు. ఆదాయపు పన్ను చెల్లింపులో భారీగా తేడాలు ఉన్నట్లు ప్రాధమికంగా గుర్తించిన ఐటీ అధికారులు ఈ సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సోదాలు సాయంత్రం వరకూ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ సోదాల్లో ఐటీ అధికారులు కీలక సమాచారాన్ని, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. సోదాలు పూర్తి అయిన తరువాత ఐటీ అధికారులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ప్రఖ్యాత కార్పోరేట్ ఆసుపత్రిగా పేరున్న యశోదలో ఐటీ సోదాలు జరగడం ఆసుపత్రి వర్గాల్లో కలకలాన్ని రేపింది.