ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విపరీతంగా పెరిగిపోతోంది. సాధారణ ప్రజల నుండి వీవీఐపీల వరకు ఎవరూ దీని బారి నుండి తప్పించుకునే అవకాశం లేకుండా పోతోంది. తాజాగా ఏపీ సీఎం సెక్యూరిటీ సిబ్బందిలో పదిమందికి కరోనా వైరస్ సోకినట్లు వార్తలు వచ్చాయి. వివరాల్లోకి వెళితే తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం వద్ద భద్రత విధులకు వెళ్లిన పదిమంది కరోనా వైరస్ బారిన పడినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా జగన్ నివాసం వద్ద డ్యూటీ ఉంటున్న ఏపీఎస్పీ మూడో బెటాలియన్ సిబ్బంది నెలన్నర కిందట జగన్ కోసమే ప్రత్యేకంగా అక్కడికి వెళ్లారు. వారిలో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించడంతో అందరికీ పరీక్షలు నిర్వహించగా అది కాస్త చివరికి 10 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్లు నిర్ధారణ లో తెలిపింది. ఇదే విషయాన్ని మూడవ బెటాలియన్ అధికార వర్గాలు ధృవీకరిస్తున్నాయి.
ఇప్పుడు జగన్ కు నిపుణులు సూచిస్తున్నది ఏమిటంటే ఆటు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చాలా ఘోరమైన స్థితిలో ఉన్నాడు. సొంత ఎమ్మెల్యేలను మంత్రులు కాపాడుకోలేని ముఖ్యమంత్రి అని అతనిపై విపక్షాల తో సహా రాష్ట్ర ప్రజలు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఇటువంటి సమయంలో జగన్ సొంత సెక్యూరిటీ గార్డులకు వైరస్ నుండి రక్షణ లేదు అన్న విషయం కనుక విపక్షాలు సీరియస్ గా తీసుకుంటే కేటీఆర్ కు పడిన కోటింగ్ అంతా జగన్ కు పడే అవకాశం ఉంది.
అదీ కాకుండా ఈ విపత్తు కాలంలో జగన్ తాను ఎంత సమర్థంగా దీనిని ఎదురుకోగలను అని చూపించడానికి అతనికి సంబంధించిన వారిని కాపాడుకోవడం కన్నా ఉత్తమమైన మార్గదర్శకం లేదు అన్నది అందరి మాట. ఈ సమయంలో రాష్ట్రం మొత్తాన్ని నడిపించే వ్యక్తి మరియు ప్రజలందరికీ కష్టకాలంలో సూచనలు ఇచ్చే వ్యక్తి తనను రక్షిస్తున్న వారికి కనీస రక్షణ కల్పించక లేకపోవడం ఏమిటన్న మాటను విపక్షాలు తెర మీదకు తీసుకుని వచ్చే లోపలే జగన్ జాగ్రత్త పడితే మంచిది అని విశ్లేషకులు సలహా.
ఇక అతని సెక్యూరిటీ గార్డుల వరకు వచ్చిన కరోనా జగన్ ను చేరకుండా అయితే ఉండదు. దాంతో ఇప్పుడు అతని అభిమానించే వారంతా ముఖ్యమంత్రి తగిన తీసుకోవాలని అతనిని అభ్యర్థించడం తో పాటు కొద్దిగా ఆవేశం కూడా వ్యక్తం చేస్తున్నారు.