ఏలూరు లో నిన్ను ఎంత మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే. వారిని ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు పరామర్శించనున్నారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి రేపు ఉదయం 10 గంటల 20 నిమిషాలకు వారిని పరామర్శిస్తారు. ఆ తర్వాత స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశమై దీని గురించి చర్చిస్తారు.
నిన్ననే ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తో మాట్లాడినట్లు తెలిసింది. ఇక బాధితులను స్వయంగా పరామర్శించడమే కాకుండా వారికి అందుతున్న చికిత్సను జగన్ పర్యవేక్షించాలి అన్నారు. అంతేకాకుండా తక్షణం ఇందుకు సంబంధించిన అన్ని విషయాలపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక వైద్యపరంగా వారికి ఎటువంటి లోటు రాకుండా చూసుకునేందుకు అధికారులతో జగన్ స్వయంగా సంప్రదించనున్నారు.
ఇక సీఎం ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఏలూరులో బాధితులను పరామర్శించి వారికి పలు పరీక్షలు చేస్తున్నారు. అంతేకాకుండా వారు అస్వస్థతకు గురికావడంతో దాని వెనుక ఉన్న కారణాలను విశ్లేషిస్తున్నారు. ఇక రేపు ఏలూరు లో జగన్ ఈ విషయమై అధికారులతో కీలక సమావేశం జరుగనుంది అని తెలుస్తోంది. ఈ దుర్ఘటనకు దారితీసిన కారణాలు, పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు జగన్ పయనమవుతున్నారు.
ఇక ఈ విషయమై సంబంధిత అధికారులకు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు జగన్ చేతిలో చివాట్లు తప్పవని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఇంత ప్రమాదం జరిగిన తర్వాత అసలు దీనికి కారణం ఏమై ఉంటుంది అన్న విషయం ఇంకా తినకపోవడం కూడా జగన్ ను అసహనానికి గురి చేసిందని తెలుస్తోంది.