అక్రమ వాహనాల రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టైన తాడిపత్రి మాజీ శాసనసభ్యులు జేసీ ప్రభాకర్ రెడ్డికి కొంత ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ జిల్లా కోర్టు కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. గత వారం జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు అరెస్టైన ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైన విషయం తెల్సిందే.
బెయిల్ కోసం ఇద్దరూ పిటీషన్ దాఖలు చేసుకోగా హైకోర్టు వాటిని తిరస్కరించింది. సుప్రీమ్ కోర్టు తిరస్కరించిన వాహనాలను రోడ్లపై ఎలా తిప్పుతారని ఆ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. మోసపూరిత పనులను అనుమతించబోమని చెబుతూ పిటీషన్లను కొట్టి వేసింది. సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా చూపి రిజిస్ట్రేషన్ చేయించారనే కేసుపై జేసీ అరెస్టైన విషయం తెల్సిందే.