NTR Satha Jayanthi: విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ లిటరేచర్, సావనీల్ అండ్ వెబ్ సైట్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇవేళ (20వ తేదీ) వేడుకలను నిర్వహిస్తొంది. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులోని ఖైతలాపూర్ మైదానంలో వేడుకలను అట్టహాసంగా జరపనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టీడీపీ అధినేత చంద్రబాబు, విశిష్ట అతిధిగా నందమూరి బాలకృష్ణ, గౌరవ అతిధిగా హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సీపీఐ నేత రాజా, సీపీఎం నేత సీతారాం ఏచూరి, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హజరు అవుతున్నారు.
అయితే ఈ ఉత్సవాల కోసం ఎన్టీఆర్ మనుమడు అయిన జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ప్రత్యేక ఆహ్వానం అందింది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సావాలకు రావాలని ఉత్సవ కమిటీ కన్వీనర్ టీడీ జనార్ధన్, ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ వెళ్లి జూనియర్ ఎన్టీఆర్ ను కు ఆహ్వాన పత్రం అందించారు. అయితే ఈ ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ హజరు కావడం లేదని సమాచారం అందింది. కారణం ఏమిటంటే.. ఈ వేళ జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. తన జన్మదిన వేడుకల వల్ల హజరు కాలేకపోతున్నట్లుగా తారక్ వెల్లడించినట్లు తెలుస్తొంది. ముందుగానే ఫ్యామిలీతో ప్రొగ్రామ్స్ పిక్స్ చేసుకోవడం వల్ల వేడుకలకు హజరుకాలేకపోతున్నానని ఉత్సవ నిర్వహకులకు జూనియర్ ఎన్టీఆర్ తెలిపినట్లు సమాచారం.