ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ తిరుపతి ఉప ఎన్నికల గురించి కొన్ని కామెంట్లు చేశారు. 2019 ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత అమెరికాలో ఉన్న ఆయన ఏపీ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికలు విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసుకుని పాల్ చేసిన కామెంట్లు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి.
ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ ఏడు పార్టీలు మారాడు, పైగా 5 పర్సెంటేజ్ ఓటు బ్యాంకు ఉంది. అసలు ఓటు బ్యాంకు లేని బీజేపీతో పొత్తు పెట్టుకోవటం తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోవడం దారుణమని విమర్శించారు. పవన్ బిజెపి ఏజెంట్ లాగా మారాడని, తెలంగాణలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించి తర్వాత వెనకడుగు వేయటం దారుణమని పేర్కొన్నారు.
నా భార్య, కూతురు క్రైస్తవ మతానికి చెందిన వారు అని చెప్పి బీజేపీతో చేతులు కలిపి ఇప్పుడు రాజకీయాలు చేయడం దారుణమని, చెట్టు పేరు చెట్టు కాయలు అమ్ముకోవడం అని పవన్ పై పాల్ డైలాగులు వేశారు. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే చిత్తశుద్ధి ఉంటే తిరుపతిలో పోటీకి జనసేన అభ్యర్థిని నిలబెట్టాలని, అవసరమైతే అమెరికా నుండి మీకోసం తిరుపతికి వచ్చి ప్రచారం చేస్తాను అంటూ పవన్ కళ్యాణ్ కి బంపర్ ఆఫర్ ప్రకటించారు కె.ఎ.పాల్. ఈ క్రమంలో రాష్ట్రంలో మతాలు పేర్లు చెప్పి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బిజెపికి ఓటు వెయ్య వద్దు అంటూ కే ఏ పాల్ అమెరికా నుండి వీడియో రూపంలో మెసేజ్ ఇచ్చారు.