Ka Paul : ప్రపంచ శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ షర్మిల కొత్త పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటినుండో దేశంలో ఎన్నికల సమయంలో తాను చెబుతున్న అన్ని విషయాలు నెరవేరుతున్నయి, రికార్డు గా ఉన్నాయి అని చెప్పుకొచ్చారు.
వైయస్ రాజారెడ్డి మరియు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో తనకి మంచి సంబంధం ఉందని కేఏ పాల్ మాట్లాడుతూ అప్పట్లో తన చారిటీకి వైయస్ తో పాటు కీలక నేతలు షర్మిల అదేవిధంగా అనిల్ కుమార్ రావటం జరిగిందని పాల్ తాజాగా పేర్కొన్నారు. షర్మిల చేత పార్టీ పెట్టించడానికి రెండే రెండు బలమైన కారణాలు దక్షిణ భారతదేశంలో క్రైస్తవుల ప్రోద్బలం ఎక్కువగా ఉండటంతో బిజెపి..షర్మిల ని పావుగా వాడుకుని..కొత్త పార్టీ పెట్టి ఇస్తున్నట్లు ఆయన ఆరోపించారు.
Ka Paul : ప్రజాశాంతి పార్టీని దెబ్బ కొట్టడానికి బీజేపీ ప్లాన్ :-
ప్రజలను ఓటర్లను కన్ఫ్యూజ్ చేయటానికి బిజెపి ఈ స్ట్రాటజీ వేసినట్లు కె ఏ పాల్ తెలిపారు. పులి మేటర్ లోకి వెళ్తే త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచశాంతి పార్టీ తరఫున తాను రంగంలోకి దిగుతున్న తరుణంలో బిజెపి భయపడుతున్నట్లు, అందుకోసమే క్రైస్తవుల ఓట్లు ప్రపంచ శాంతి పార్టీ వైపు వెళ్లకుండా షర్మిల చేత కమలదళం సభ్యులు పార్టీ పెట్టినట్లు కేఏ పాల్ ఆరోపించారు. అంత మాత్రమే కాక తనతో పైకి బాగానే మాట్లాడుతున్నావు అని తనకు నోబెల్ బహుమతి రాకుండా బిజెపి పార్టీకి చెందిన పెద్దలు అడ్డుకుంటున్నారని..తనని ఎదుర్కోవటం కోసమే షర్మిల చేత బిజెపి నేతలు పార్టీని పెట్టించే ప్లాన్ వేసినట్లు కె ఏ పాల్ తెలిపారు.