Kakinada fishermen missing: చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతు అయ్యారు. కాకినాడ పర్లోవపేటకు చెందిన మత్స్యకారులు బోటులో నిన్న చేపల వేటకు వెళ్లారు. సముద్రంలో ఉండగా బోటు ఇంజన్ ఆగిపోవడంతో వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. భీమునిపట్నం వైపు బోటు కొట్టుకుపోతోందని వారు తెలిపారు.
మత్స్యకారుల కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే బోటులో ఉన్న వారి సెల్ ఫోన్ లు స్విచ్ ఆఫ్ కావడంతో వారి ఆచూకి లభించలేదు. మత్స్యకారులు ఆచూకీ దొరకక వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.