Petrol Diesel price: భారత్ లో పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. 15 రోజుల్లో 13 సార్లు ధరలు పెరిగాయి. లీటరుకు రూ.9.20లు రెండు వారాల్లో పెరిగింది. ప్రతి రోజు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతుండటంతో సామాన్య, మద్య తరగతి వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలు సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 80 పైసలు వంతున పెంచాయి. తాజాగా పెరిగిన ధరలతో .. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.104.61 లకు, డీజిల్ లీటరు రూ.94.87కి చేరుకుంది.
Petrol Diesel price: తెలుగు రాష్ట్రాల్లో
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎక్కువగా ఉంటున్నాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.118.57లకు పెరగ్గా డీజిల్ ధర 104.62లకు పెరిగింది. కరీంనగర్ లో లీటరు పెట్రోల్ ధర రూ.118.51లు, డీజిల్ ధర రూ.103.80లకు చేరింది. ఇక విజయవాడలో లీటరు పెట్రోల్ ధర రూ.119.35కి చేరగా, డీజిల్ ధర రూ.106.70 కి పెరిగింది. విశాఖలో పెట్రోల్ ధర రూ.119.01లు చేరగా, డీజిల్ ధర రూ.104 79లకు చేరింది.