Tollywood : గత ఏడాది మొత్తం కరోనా కోరలు చాలా మందిని బలి తీసుకున్న సంగతి తెలిసిందే. దేశ విదేశాలతో పాటు మన భారత దేశంలో కూడా కరోనా విస్తృతంగా వ్యాపించి చాలా మంది ప్రాణాలు పోవడానికి కారణం అయింది. దానివల్ల గత ఏడాది దాదాపు 7నుంచి 8నెలలు షుటింగ్స్ అన్ని నిలిపి వేసిన సంగతి తెలిసిందే. జీవనోపాది కూడా కష్టమయిన సంగతి తెలిసిందే. అన్నీ ఇండస్ట్రీస్ తో పాటు సినీ ఇండస్ట్రీ కూడా ఆర్ధిక సంక్షోభంలో కూరుకు పోయింది. ఎట్టకేలకి మళ్ళీ కాస్త పరిస్థితులు చక్కబడ్డాయనుకుంటే మళ్ళీ సెకండ్ వేవ్ మొదలైంది.
సెకండ్ వేవ్లో ఎక్కువగా సినిమా వాళ్ళకి పాజిటివ్ కేసులు రావడం షాక్ కి గురి చేస్తోంది. ఎక్కువగా నిర్మాతలు దర్శకులు నటీ నటులకి సెకండ్ వేవ్లో కరోనా ప్రభావం చూపుతోంది. తాజాగా హీరోయిన్ నివేదా థామస్ కు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. వకీల్ సాబ్ సినిమా అతి త్వరలో రిలీజ్ కాబోతుండగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో నివేదా థామస్ కి కరోనా సోకి ఉండొచ్చునని భావిస్తున్నారు. ప్రస్తుతం తను సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటోంది.
Tollywood : సినీ ప్రముఖులకి కరోనా పాజిటివ్..!
ఇక టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు కొన్ని మీడియాలలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆయన కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా కూడా పాజిటివ్ వచ్చినట్టు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత కరోనా సోకగా.. కొన్ని రోజులకు మళ్ళీ నెగెటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాతలు ఎన్వీ ప్రసాద్ – వివేక్ కూచిబొట్ల వంటి వారు కరోనా బారినపడి చికిత్స తీసుకొని త్వరగానే కోలుకున్నారట. వీరే కాదు మరికొందరు సినీ ప్రముఖులకి కూడా కరోనా పాజిటివ్ రాగా బయటకు వెల్లడించడం లేదని చెప్పుకుంటున్నారు. మొత్తానికి కరోనా సెకండ్ వేవ్ టాలీవుడ్ ని వణికిస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!