KGF : కేజీఎఫ్ సినిమాలతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్కి ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. రాజమౌళి రేంజ్లో పాపులారిటీ వచ్చిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు టాలీవుడ్లో పలువురు స్టార్ హీరోలు, నిర్మాతలు క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్లో ఉండగా డార్లింగ్ ప్రభాస్తో సలార్ అన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ని తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ జరుగుతుండగా శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా మీద ప్రభాస్ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ సినిమాని 2022 ఏప్రిల్ న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుండగా అధికారకంగా రిలీజ్ డేట్ని కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు ప్రభాస్ – దిల్ రాజు కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయట.
KGF : దిల్ రాజుకి ఇప్పటికీ ప్రభాస్తో ఆ అవకాశం రాలేదు.
ఇప్పటికే దిల్ రాజు – ప్రభాస్ కాంబినేషన్లో మున్నా, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు వచ్చాయి. అయితే మరో సినిమా చేయాలనుకున్న దిల్ రాజుకి ఇప్పటికీ ప్రభాస్తో ఆ అవకాశం రాలేదు. ఎట్టకేలకి సలార్ కాంబోని దిల్ రాజు సెట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. భారీ పాన్ ఇండియన్ సినిమాగా ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా నిర్మించడానికి దిల్ రాజు భారీ బడ్జెట్ని కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఇక దిల్ రాజు ఇటీవలే రాం చరణ్ – శంకర్ కాంబినేషన్లో ఒక పాన్ ఇండియన్ సినిమాని ప్రకటించాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!