తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలను ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు చేసుకున్నాయి. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా చెప్పుకుంటుంటారు. ఖైరతాబాద్ గణనాధుడు పూజలు అందుకునేందుకు సిద్ధమైయ్యాడు. 1954 లో ఒక్క అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణనాధుడు ప్రతి ఏటా ఒక్కో అడుగు పెంచుకుంటూ వస్తున్నారు. 2014 లో 60 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన భారీ గణనాధుడి విగ్రహానికి షష్టిపూర్తి మహోత్సవం కూడా ఘనంగా నిర్వహించిన నిర్వహకులు ఆ తర్వాత నుండి ఒక్కో అడుగు విగ్రహ ఎత్తు తగ్గిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది 50 అడుగుల ఎత్తులో శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి గా భక్తులకు దర్శనమివ్వనున్నాడు ఖైరతాబాద్ గణనాధుడు. భక్తులకు లక్ష్మీకటాక్షం కలగాలని ఆంకాక్షిస్తూ శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి రూపంలో ఖైరతాబాద్ గణనాధుడిని ఏర్పాటు చేశారు. మండపంలో కుడి వైపున శ్రీ షణ్ముఖ సుబ్రమణ్య స్వామి, ఎడమ వైపు శ్రీ త్రిశక్తి మహా గాయత్రి దేవిని కొలువు తీర్చారు.
ఈ సారి విశేషం ఏమిటంటే.. మొట్టమొదటి సారిగా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 150 మంది కళాకారులు జూన్ పది నుండి 80 రోజుల పాటు పగలు రాత్రి కష్టపడి ఖైరతాబాద్ గణనాధుడిని రూపొందించారు. ఈ విగ్రహ తయారీకి సుమారు కోటిన్నర వ్యయం అయ్యింది. కాగా రేపు (బుధవారం) వినాయక చవితిని పురస్కరించుకుని అనవాయితీ ప్రకారం పద్మశాలీ సంఘం వారు ఉదయాన్ని గణనాధుడికి యజ్ఞోపవేతం, కండువా సమర్పిస్తారు. తదుపరి 10.30 గంటలకు గవర్నర్ తమిళి సై దంపతులు ఖైరతాబాద్ గణనాధుడికి తొలి పూజ నిర్వహిస్తారు. అనంతరం గణనాధుడి దర్శనానికి భక్తులకు అనుమతిస్తారు.
ఖైరతాబాద్ గణనాధుడిని చూసేందుకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు నిర్వహకులు బారికేట్లను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ చౌరస్తా, ఐమాక్స్, లక్టీకాపూల్ నుండి వచ్చి ఖైదరాబాద్ గణనాధుడిని దర్శించుకునేలా నిర్వహకులు ఏర్పాట్లు చేశారు. ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పక్షాల ప్రముఖులు ఖైరతాబాద్ గణనాధుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు.
బిగ్ బ్రేకింగ్: ఏపిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటునకు కేంద్రం ఆమోదం