నందమూరి బాలకృష్ణ మూవీలంటేనే చాలు మాస్ ఆడియెన్స్ తెగ సంబురపడిపోతుంటారు. అందులోనూ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తే బాలయ్య సినిమా ఓ క్రేజ్ సంపాదించుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. భారీ డైలాగులతో, అదిరిపోయే పంచ్ డైలాగులతో, అబ్బురపరిచే ఫైటింగ్ సెట్స్ లతో తెరకెక్కుంతుంది ఆ మూవీ. కాగా తన క్రియేటివిటీ టాలెంట్ తో తనకంటూ ఎన్నో అవార్డును, రివార్డులను సొంతం చేసుకున్నారు బోయపాటి శ్రీను.
భద్ర సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచమైయ్యారు బోయపాటి శ్రీను. తన ప్రతిభతో ఎన్నో సినిమాలు తీసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తును సంపాదించుకున్నరు ఈయన. కాగా ప్లాఫ్ లతో ఊగిసలాడుతున్న మన నందమూరి బాలకృష్ణ కు మంచి హిట్ ను కూడా ఈయనే అందించారు. అదేనండి సింహ మూవీతో ప్లాప్ తెచ్చుకున్న బాలయ్యను మళ్లీ విజయాల బాట పట్టేలా డైరక్షన్ తో అదరగొట్టాడు బోయపాటి శ్రీను.
తెలుగు ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ఎవరంటే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు బోయపాటి శ్రీను. అయతే తాజాగా బాలయ్య కథానాయకుడిగా, బోయపాటి దర్శకత్వంలో ఒక కొత్త సినిమా తెరకెక్కబోతుంది. వీరిరువురి మధ్యలో వస్తున్న ఈ సినిమా మంచి యాక్షన్ మూవీగా తెరకెక్కనున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాల స్క్రిప్ట్ లో తాజాగా కొన్నిమార్పులు, చేర్పులు చేశారు. ఈ మూవీలో బాలయ్య సరసన ఇద్దరు ముద్దుల భామలు హీరోయిన్లుగా నటించబోతున్నారు.
కాగా ఇప్పుడు ఒక కథానాయికకు సంబంధించిన భాగాన్ని పూర్తిగా తొలగించినట్టు సమాచారం. అలాగే ఈ మూవీలో రెండు పాటలను కూడా తొలగించారని తెలుస్తోంది. అయితే కరోనా మహమ్మారి రావడం షూటింగ్ ఆగిపోవడం మూలంగా మూవీలో డైరెక్టర్ బోయపాటి ఈ మార్పులు చేశారట. అయితే బాలకృష్ణ ఈ మూవీలో రెండు పాత్రల్లో కనిపిస్తారట. అయితే అందులో ఒకటి అఘోర పాత్ర ఉందని షోషల్ మీడియాలో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. అయితే రీసెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అఘోరా పాత్రలు లేవని కేవలం ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ పాత్రమాత్రమేనని తెలస్తోంది. చూడాలి మరి ఈ మూవీ హిట్ కొడుతుందో లేదా తుస్సు మంటుందో..
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!