YS Jagan: పిఆర్సీ సాధన కోసం ఉద్యమాలు చేసిన ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంతో జరిపిన చర్చల అనంతరం సమ్మెను విరమించిన సంగతి సంగతి తెలిసిందే. ప్రభుత్వంతో రాజీపడి ఉద్యోగ సంఘాలు సమ్మె విరమించిన నేపథ్యంలో పలు ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాల జేఏసీ నుండి బయటకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని నిన్న సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కమ్యూనిస్టు పార్టీలపై విమర్శలు గుప్పించారు. ముందు ఎర్ర జెండా వెనుక పచ్చ జెండా అంటూ విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కమ్యూనిస్టులతో ఉపాధ్యాయులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తున్నారంటూ ఆరోపించారు.
YS Jagan: ప్రభుత్వాలతో సంబంధం లేదు.. ప్రజా సమస్యలే ముఖ్యం
సీఎం జగన్ కమ్యూనిస్టు పార్టీలపై చేసిన విమర్శలకు ఆ పార్టీ నేతలు కౌంటర్ ఇచ్చారు. సీపీఎం సీనియర్ నేత మదు స్పందిస్తూ బీజేపీకి జగన్ వత్తాసు పలకడం మానుకోవాలని హితవు పలితారు. కమ్యూనిస్టు పార్టీలపై నిందలు వేయడం తగదని మధు అన్నారు. సమస్యలను పరిష్కరించకుండా ఏ ప్రభుత్వం మొండికేసినా వారికి కమ్యూనిస్టు పార్టీలు అండగా ఉంటాయని గుర్తు చేశారు. కమ్యూనిస్టులకు ప్రభుత్వాలతో సంబంధం లేదని, ప్రజా సమస్యలే ముఖ్యమని మధు స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించారా అని మధు ప్రశ్నించారు.
ముందు ఉండి ఉద్యమాన్ని నడిపిస్తాం
మరో పక్క సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను జగన్ మోసం చేశారని విమర్శించారు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ఇవ్వడానికి జగన్ కు వచ్చిన ఇబ్బంది ఏమిటి అని ప్రశ్నించారు మధు. 43 శాతం పిట్ మెంట్ అందుకున్న ఉద్యోగులకు 23 శాతం ఫిట్ మెంట్ ఏ రకంగా ప్రయోజనకరమని అన్నారు. రేపు వామపక్ష పార్టీలతో సమవేశం నిర్వహించి ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఉద్యమాలకు కార్యాచరణ రూపొందిస్తామనీ, ఉద్యోగుల ఉద్యమానికి తాము ముందు ఉండి నడిపిస్తామని రామకృష్ణ పేర్కొన్నారు.