Eye Strain: కంటి సమస్యలను ఎంత జాగ్రత్త వహిస్తే అంత ప్రమాదంగా మారుతాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ స్క్రీన్ పై గంటల తరబడి కాలన్ని గడుపుతున్నారు. దాంతో కంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. పైగా ఈ రోజుల్లో నిరంతరం కంప్యూటర్ పై చేసే ఉద్యోగాలు ఎక్కువగా ఉంటున్నాయి.. ఎక్కువసేపు మొబైల్ స్క్రీన్, ల్యాప్టాప్, డెస్క్టాప్ స్క్రీన్స్ చూడటం వలన.. కంటిపై ఒత్తిడి ఎక్కువై తలనొప్పి, కళ్ళు పొడిబారడం, కళ్ళు మంటలు, డార్క్ సర్కిల్స్ వంటి సమస్యలు వస్తున్నాయి.. వీటన్నింటికీ ఈ సింపుల్ చిట్కా తో చెక్ పెట్టండి..
మన కంటి చూపుని కాపాడుకునే బాధ్యత మన మీదే ఉంటుంది ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత మీ నోటిని నీటితో నింపుకుని కొన్ని సెకండ్లు కళ్ళు మూసుకుని ఉండాలి . ఆ తర్వాత నీటిని ఊసేయాలి. ఇలా రెండు, మూడు సార్లు చేయాలి. కళ్ళు అలసినప్పుడు, కళ్ళు మంటలు గా ఉన్నప్పుడు త్రిఫల నీటితో మీ కళ్లను కడుక్కుంటే ప్రయోజనం కనిపిస్తుంది. లేదంటే నార్మల్ వాటర్ తో మీ ముఖాన్ని కళ్ళను కడుపున మంచి ఫలితం ఉంటుంది.
Read More: Eye Bath: అలసిన కళ్ళకు “ఐ బాత్” చేయించండి..!! బెన్ఫిట్స్ ఇవే..!!
ఆరో వాటర్ వేడి చేసి అందులో కాటన్ బాల్ ను ఉంచాలి. కంటి నొప్పి గా ఉన్నప్పుడు ఈ కాటన్ బాల్ ను కళ్లపై పెట్టుకోవాలి. ఇది తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. ఐస్ క్యూబ్స్ కళ్లపై ఉంచడం మంచిది. కాకపోతే వాటిని ఒక కాటన్ క్లాత్ లో వేసుకుని కళ్ళపై ఉంచుకుంటే స్వాంతన లభిస్తుంది. కళ్ళపై ఒత్తిడిని తగ్గించుకోవడానికి కంప్యూటర్, ఫోన్స్ లో డార్క్ మోడ్ సదుపాయం ఉంటుంది. అలసటగా ఉన్నప్పుడు వాటిని ఆన్ లో పెట్టుకోండి. ఎక్కువ సేపు స్క్రీన్ ను చూడటం వల్ల కంటి సమస్యలు వస్తాయి. ప్రతి అరగంటకు ఒకసారి రెండు నిమిషాలు కళ్లకు విశ్రాంతి ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ పనిని మొదలు పెట్టండి.