ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి 14 ఏళ్ల తరువాత నలుగురు నిందితులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ ప్రయాగ్రాజ్లోని ప్రత్యేక కోర్టు నేడు తీర్పు వెలువరించింది. ఒకరిని నిర్దోషిగా కోర్టు ప్రకటించింది.
పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు 2005 జూలైలో అయోధ్యలోని వివాదాస్పద రామ్ జన్మభూమి – బాబ్రీమసీదు స్థలంలో తాత్కాలిక ఆలయంపై దాడి చేయడానికి ప్రయత్నించారు.