దశాబ్దాల తరబడి అయోధ్యలోని రామమందిరం నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఆగష్టు 5న అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమి పూజ జరుగనుంది. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేసి భూమి పూజ చేయనున్నారు. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తోంది శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్ట్. ఇందులో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించనుంది. వీరితోపాటు కేవలం 150మంది అతిథులతో కలిపి 200 మంది మాత్రమే కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ట్రస్ట్ తెలిపింది.
దీనిపై ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవగిరి మాట్లాడుతూ.. ‘కార్యక్రమంలో భాగంగా భూమి పూజకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ రామ మందిరంలోని రాముడికి పూజ చేస్తారు. తర్వాత హనుమాన్ గిరి ఆలయంలో హనుమంతుని పూజ లో పాల్గొంటార’ని తెలిపారు. దశాబ్దాల నుండి రామమందిరం నిర్మాణంపై ఎన్నో వివాదాలు జరిగాయి. మొత్తాదనికి మోదీ ప్రభుత్వ హయాంలో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. ఎన్నో నివేదికలు పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు చారిత్రక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆమోదం తెలుపడంతో పాటు ముస్లింలకు అయోధ్య లోనే మసీదు నిర్మాణానికి మరోచోట స్థలాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే.