రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పెద్ద చర్చకు తెరలేపిన ప్రభుత్వ కార్యాలయాల తరలింపు, రాజధాని వికేంద్రీకరణ, హైకోర్టు తరలింపు, సీఆర్డీఏ రద్దు బిల్లుల పిటిషన్ పై హైకోర్టులో కొద్దిసేపటి క్రితమే విచారణ జరిగింది.
రాజధాని ఎక్కడ ఉండాలి అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశం అని హైకోర్టు వివరించడం ఇక్కడ గమనార్హం. అంతేకాకుండా దాఖలైన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశించింది. గతకొద్దికాలంగా హైకోర్టులో ఏ విషయంలో కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సానుకూలంగా రాకపోవడం గమనార్హం.
ఇలాంటి సమయంలో శాసన మండలి రద్దు బిల్లు పార్లమెంట్ లో పెట్టినా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ దానిని పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మళ్లీ ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని హైకోర్టు తేల్చేసేసరికి మళ్ళీ మోడీ వద్దకే జగన్ వెళ్ళవలసిన పరిస్థితి ఎదురైంది. ఇటు చూస్తేనేమో ఏపీ బీజేపీ ఈ మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తుండగా మోడీ జగన్ కు ఈ విషయంలో ఎంత మాత్రం సహకరిస్తాడు అన్న విషయం ఇంకా అనుమానంగానే ఉంది