Mahesh babu – Namrata : టాలీవుడ్ క్రేజీ సెలబ్రెటీ జంటల్లో మహేష్ బాబు – నమ్రత శిరోద్కర్ జంట ఒకటి.. 10 ఫిబ్రవరి 2005 లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నేటికీ నవదంపతుల ప్రేక్షకుల గుండెల్లో గూడుకట్టుకున్నారు.. ఈరోజు వారి పెళ్లి రోజు సందర్భంగా మహేష్ బాబు తన ట్విట్టర్ లో హ్యాపీ 16th మై లవ్ .. టు ఫర్ ఎవర్ అండ్ బియాండ్ విత్ యు అంటూ ట్వీట్ చేశారు.. మహేష్ బాబు నమ్రత కు ముద్దు పెడుతున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..
మహేష్ బాబు నమ్రత వంశీ అనే సినిమాలో కలిసి నటించారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య మొదలైన స్నేహం ఆతర్వాత ప్రేమగా మారింది. మహేష్ బాబు ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలపడంతో వారిని ఎదిరించిన మహేష్ బాబు , నమ్రత ముంబైలో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. 16 సంవత్సరాల దాంపత్య జీవితంలో అన్యోన్య దంపతులుగా పేరుతెచ్చుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు గౌతంకృష్ణ, సితార.
ఈరోజు వారిద్దరికీ పెళ్లి జరిగి 16 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా మహేష్ బాబు నమ్రత విషెస్ చెప్తూ అమౌంట్ ఫోటోలు షేర్ చేశారు. ఇక నమ్రత కూడా తన మహేష్ తో తీసుకున్న రొమాంటిక్ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇన్నేళ్ళ జీవితంలో ప్రేమ, నమ్మకం ఉన్నాయని కామెంట్ చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు నమ్రత సహా ఇద్దరు పిల్లలు గౌతమ్, సితార దుబాయ్ లో ఉన్నారు. మహేష్ లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ నిమిత్తం దుబాయ్ లో ఉన్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!