NTR : ఎన్.టి.ఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమరం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రాం చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకుంది. మరొక వైపు ఎవరు మీలో కోటీశ్వరులు అన్న రియాలిటీ షోకి హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు ఎన్.టి.ఆర్. కాగా వాస్తవంగా ఎన్.టి.ఆర్ నెక్స్ట్ సినిమాని మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ తో చేయాల్సి ఉంది. ఈ సినిమాని ఎన్.టి.ఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని బ్యానర్స్పై భారీ బడ్జెట్తో పాన్ ఇండియన్ రేంజ్ సినిమాగా ప్లాన్ చేశారు.
కానీ ఇప్పుడు కాంబోలో సినిమా పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తోంది. సూపర్స్టార్ మహేష్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘సర్కారువారిపాట’. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ వెళ్లే మహేష్ ఈసారి రూట్ మారుస్తున్నాడట. ‘సర్కారు వారి పాట’ సినిమా సెట్స్పై ఉండగానే మరో సినిమాను అనౌన్స్ చేయబోతున్నారని తాజా సమాచారం. మహేష్ అఫీషియల్ గా వచ్చిన కన్ఫర్మేషన్ ప్రకారం ‘సర్కారు వారి పాట’ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియన్ సినిమా చేయాలి.
NTR : పదకొండేళ్లకి మళ్ళీ మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా..!
కానీ ఈ ప్రాజెక్ట్ మొదలవడానికి ఇంకా చాలా సమయం పడుతుండటంతో ఈ గ్యాప్లో మహేష్ ..త్రివిక్రం సినిమా చేయబోతున్నాడట. ఈ సినిమా ప్రకటన సూపర్స్టార్ కృష్ణ పుట్టినరోజు.. మే 31న రాబోతోందట. సర్కారువారిపాట’ సినిమా పూర్తి కాగానే.. మహేష్ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా త్రివిక్రమ్ సినిమా సెట్స్ మీదకి రాబోతోందని తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఈ సినిమాని నిర్మించనున్నారని సమాచారం. ‘ఖలేజా’ తర్వాత పదకొండేళ్లకి మళ్ళీ మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రూపొందనుండటం విశేషం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!