అఖిల్ నటించిన సినిమాలు ఇప్పటికే మూడు రిలీజైయ్యాయి. కాని అఖిల్ ఖాతాలో ఒక్కటి కూడా సరైన హిట్ గా చేరలేకపోయింది. అఖిల్ నటించిన ఫస్ట్ సినిమా ‘ అఖిల్ ‘ కి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించాడు. యంగ్ హీరో నితిన్ భారీ బడ్జెట్ తో నిర్మించాడు. స్టార్ డైరెక్టర్.. నితిన్ లాంటి పాపులర్ ప్రొడ్యూసర్ అక్కినేని ఫ్యామిలీ నుంచి పరిచయం అవుతున్న హీరో.. అయినా అఖిల్ డెబ్యూ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. చెప్పాలంటే ఈ సినిమాతో నితిన్ భారీగా నష్టపోయాడు.
ఇక ఈ సినిమా తర్వాత మనం ఫేం విక్రం కుమార్ దర్శకత్వంలో హలో అన్న సినిమా చేశాడు. ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా నిర్వహించారు. మనం సినిమా సక్సస్ ని బాగా వాడారు. అయినా అఖిల్ కి రెండవ సినిమా నిరాశనే మిగిల్చింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న హలో మ్యూజిక్ పరంగా అంత సక్సస్ కాలేదు. సినిమా కూడా ఫ్లాప్ గా నిలిచింది. మరొక పక్క అఖిల్ సినిమాకి హీరోయిన్స్ సెట్ అవడం లేదన్న కామెంట్స్ కూడా వచ్చాయి.
దాంతో మూడవ సినిమా విషయంలో చాలా పక్కాగా ప్లాన్స్ చేసి యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి చేతిలో పెట్టారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా మిస్టర్ మజ్ఞు అన్న టైటిల్ తో తెరకెక్కించారు. అన్న నాగ చైతన్య నటించిన నిధి అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే సినిమా మొత్తం చూశాక కథ చాలా వీక్ గా ఉందన్న కామెంట్స్ వచ్చాయి. ఫైనల్ గా ఈ సినిమా రిజల్ట్ కూడా డిసప్పాయింట్ చేసింది. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చేస్తున్నాడు.
ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే అఖిల్ పక్కన పూజా హెగ్డే అంతగా సూటవలేదన్న టాక్ ఉంది. అందుకే అఖిల్ 5 కి కొత్త అమ్మాయిని తీసుకున్నట్టు లేటెస్ట్ న్యూస్. ఇన్నాళ్ళకి అఖిల్ పక్కన కొత్తమ్మాయిని సెలెక్ట్ చేసి మంచి డెసిషన్ తీసుకున్నారని అంటున్నారు. ప్రముఖ మోడల్ అయిన సాక్షి వైధ్య ని ఫైనల్ చేశారని త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని అంటున్నారు. సురేందర్ రెడ్డి దర్శకతంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!