Sai Dharamtej: నిన్న రాత్రి నుండి తెలుగు మీడియాలో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ వార్త వైరల్ అవుతుంది. కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్ నుండి సాయి ధరమ్ తేజ్ పడిపోవడంతో.. జాతి భాగానికి కుడికన్ను పైభాగానికి అదే రీతిలో మెడకు బలమైన గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే మెడికవర్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు స్థానికులు. వెంటనే వైద్యులు చికిత్స ప్రారంభించడంతో అవుట్ ఆఫ్ డేంజర్ అయిన తర్వాత.. సాయిధరమ్ తేజ్ నీ అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే చాలా మంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు.. ఆసుపత్రిలో స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్ ని పరామర్శిస్తూ వస్తున్నారు.
నిన్న రాత్రి పవన్ కళ్యాణ్.. ఇంకా మెగా కాంపౌండ్ హీరోలంతా.. ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఈరోజు సాయంత్రం మంచు మనోజ్.. సాయి నీ పరామర్శించి తరువాత మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన ఎమోషనల్ అవ్వడం జరిగింది. ఇటువంటి రోజుల్లో.. అటువంటి వ్యక్తి ఉండరని, సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని… ఎంతో స్వీట్ హార్ట్ కలిగిన వ్యక్తి అంటూ మంచు మనోజ్ చెప్పుకొచ్చారు. అంత మాత్రమే కాక ఆయనపై ఎటువంటి రూమర్స్ క్రియేట్ చేయొద్దని.. విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. యాక్సిడెంట్ జరిగిన స్పాట్ దగ్గరికి వెళ్లడం జరిగిందని పేర్కొన్నారు.
అంత మాత్రమే కాక ప్రమాదం జరిగిన వెంటనే సాయి ధరమ్ తేజ్ నీ హాస్పిటల్ లో జాయిన్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ మనోజ్ మీడియా ముందు ఎమోషనల్ గా మాట్లాడారు. ఇదే తరుణంలో మంచు లక్ష్మి కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించారు..‘తేజ్ బాధ్యత కలిగిన వ్యక్తి. నాకు తెలిసినంతవరకూ తేజ్ ఎంతో బాధ్యతాయుతమైన పౌరుడు. అతను ఏక్షణంలోనూ రూల్స్కు వ్యతిరేకంగా వ్యవహరించడు. రోడ్డుపై ఉన్న మట్టి వల్లే అతనికి ఈ ప్రమాదం జరిగిందని అక్కడ క్లియర్గా తెలుస్తోంది. కాబట్టి దయచేసి ఇలాంటి వదంతులు వ్యాప్తి చేయకండి. ఇప్పుడు అతను క్షేమంగానే ఉన్నాడు. సాయి త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిద్దాం’ అంటూ రియాక్ట్ అయ్యారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!