Jaati ratnaalu : జాతి రత్నాలు సినిమాతో స్టార్ డైరెక్టర్ అయ్యాడు కెవి అనుదీప్. అంతక ముందు పిట్టగోడ అన్న చిన్న సినిమా తీశాడు. ఈ సినిమా వచ్చినట్టు కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. ఇలాంటి
దర్శకులకు మళ్ళీ అవకాశాలు రావడం అన్నది అంత సులభంగా జరగని పని. అయితే డెబ్యూ సినిమా రిజల్ట్ వల్ల అతనిలో టాలెంట్ లేదని ఎవరన్నారు.. టైం బ్యాడ్.. అదే టైం కలిసి వస్తే గ్యారెంటీగా హిట్ ఇస్తాడు అన్న నమ్మకంతో ఉండే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళే స్వప్న సినిమా నిర్మాతలు. మొదటి సినిమా ఎవడే సుబ్రమణ్యం సినిమా నుంచి తాజాగా వచ్చిన జాతిరత్నాలు సినిమా వరకు వారి బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ సక్సస్ అందుకొని నిర్మాతల మీద వసూళ్ళ వర్షం కురిపించినవే.
తాజాగా జాతి రత్నాలు సినిమా తీసిన దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాలో నటించిన నవీన్ పొలిశెట్టి తో పాటు హీరోయిన్, రాహుల్ రామకృష్ణ, ప్రియ దర్శి తో పాటు దర్శకుడు అనుదీప్ కి మంచి లైఫ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే దర్శకుడు అనుదీప్ కి ఇప్పుడు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయట. అదందులో ఏకంగా మెగా మేనల్లుడు ఉప్పెన సినిమాతో భారీ సక్సస్ అందుకున్న వైష్ణవ్ తేజ్ తో సినిమా చేసే అవకాశం అందుకున్నట్టు తెలుస్తోంది.
Jaati ratnaalu : వైష్ణవ్ తేజ్ – అనుదీప్ ల కాంబోలో సినిమా…!
ఉప్పెన సినిమా తర్వాత మెగా మేనల్లుడు వరసగా ప్రాజెక్ట్స్ ని ఓకే చేస్తున్నాడు. ఇప్పటికే రెండవ సినిమా క్రిష్ దర్శకత్వంలో కంప్లీట్ చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఈ
సినిమా త్వరలో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయబోతున్నారు. అలాగే అన్నపూర్ణ బ్యానర్ లో ఒక సినిమా చేయబోతున్నాడన్న వార్తలు వస్తున్నాయి. కాగా తాజా సమాచారం ప్రకారం వైష్ణవ్ తేజ్
– జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ ల కాంబోలో సినిమా ప్రారంభం కాబోతుందట. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!