గత కొద్దికాలంగా తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్గా మారిన సంగతి తెలిసిందే. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు, టీఆర్ఎస్ ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కుర్చీ కైవసం చేసుకునేందుకు సరిపడా సీట్లు సొంతం చేసుకోలేకపోయింది టీఆర్ఎస్ పార్టీ.
ఇలా టీఆర్ఎస్ పార్టీయే ఇరుకున పడుతుందని అనుకుంటున్న తరుణంలో తాజాగా అదే పార్టీకి చెందిన ఓ మంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను అడ్డంగా బుక్ చేసినంత పని చేశారు.
కేసీఆర్ కల…. మంత్రి షాకిచ్చిన వేళా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు సాక్షాత్తు సొంత మాత్రే షాకిచ్చారని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ కలల ప్రాజెక్టుల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు ఒకటి. పేద వారికి రెండు పడక గదుల సొంత ఇళ్లు కట్టించి ఇచ్చే ఈ పథకం విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కారు ఒకింత జాప్యం చేస్తోందనే విమర్శను ప్రతిపక్షాలు చేస్తుంటాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో వేగంగా ఇళ్ల నిర్మాణం పూర్తయింది. అలా పూర్తయిన వాటిల్లో హైదరాబాద్ ఒకటి. నగరంలోని వనస్థలిపురం రైతుబజార్ పక్కన నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు బుధవారం ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ ఇళ్లను ప్రారంభించారు.
మంత్రి దిమ్మతిరిగే కామెంట్లు
ఓ వైపు ప్రభుత్వం ఇలా డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ప్రారంభిస్తుంటే మరోవైపు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందరికీ రావని మంత్రి తేల్చి చెప్పారు. ప్రభుత్వం కట్టే ఇళ్లు చాలా తక్కువని అవి కూడా లాటరీలో కేటాయిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. దేవుని దయ ఉంటే లాటరీలో ఇల్లు వస్తుందని… ఏ ప్రభుత్వం కూడా లక్షల్లో ఇళ్లు కట్టి ఇవ్వలేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏటా కొన్ని ఇళ్లు కడుతూనే ఉంటుందని.. దేవుని దయ ఉంటే ఎప్పుడోసారి ఇల్లు వస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.