స్టాక్ మార్కెట్ లో వరుసగా వస్తున్న పబ్లిక్ ఇష్యూలు మదుపరులకు కాసుల పంట పండిస్తున్నాయి. ప్రతినెల ఒకటి ఉంటున్న పబ్లిక్ ఇష్యూలు అతి తక్కువ రోజుల్లోనే పెట్టిన పెట్టుబడిని డబుల్ చేస్తున్నాయి. కరోనా కాలంలో అయితే పబ్లిక్ ఇష్యూ లన్నీ లాభాలు తెచ్చిపెట్టాయి. పబ్లిక్ ఇష్యూ ల కోసం మదుపరులు ఆశగా ఎదురుచూస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. పెట్టిన పెట్టుబడి కేవలం మూడు నాలుగు రోజుల్లోనే డబల్ అవ్వడం లేదా అంతకు మించి పెరగడం జరుగుతుండటంతో స్టాక్ మార్కెట్ పబ్లిక్ ఇష్యులకు డిమాండ్ ఏర్పడింది.
ఏమిటీ పబ్లిక్ ఇష్యూ??
ఒక కంపెనీ తన వ్యాపారాన్ని విస్తరించడానికి కానీ, ఇతర వ్యాపార అవసరాల నిమిత్తం గాని తమ కంపెనీ లోని కొంత మొత్తం వాటాల శాతాన్ని షేర్ల రూపంలో విక్రయించడం పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ). పబ్లిక్ ఇష్యూ కి మొదట సెబి అనుమతి తీసుకోవాలి. చెవి అనుమతి ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ జారీ అవుతుంది. కంపెనీ ఎందుకోసం ఎంత మొత్తం సేకరించాలి అనుకుంటుందో వివరంగా తెలపాలి. పబ్లిక్ ఇష్యూకు సేకరించిన సొమ్మును ఇతర అవసరాలకు మళ్ళించడం నేరం. కంపెనీ పూర్తి వివరాలతో లాభాలు నష్టాలు ఇతర ఆస్తులు వివరాలతో నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. అన్ని అనుమతులు వచ్చిన తరువాత కంపెనీ పబ్లిక్ ఇష్యూ మొదలవుతుంది.
** దీనిలో కొంత మొత్తం షేర్లను ఒక లాటుగా పెట్టి అమ్ముతారు. సాధారణంగా స్టాక్ మార్కెట్ లో ఒక షేర్లను కొనుగోలు చేయవచ్చు. అమ్ముకోవచ్చు. పబ్లిక్ ఇష్యూలో ఒకటి రెండు షేర్లు అమ్ముకోవడం కుదరదు. లాట్ మొత్తం కొనుక్కోవాల్సి ఉంటుంది లేదా అనుకోవాల్సి ఉంటుంది. పబ్లిక్ ఇష్యూ కేవలం రెండు రోజులు ఉంటుంది. ఆ సమయంలోనే దీనిలో నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న అంతమాత్రాన కచ్చితంగా కంపెనీ షేర్లు మనకు వస్తాయి అని నమ్మకం లేదు. కంపెనీ ప్రకటించిన షేర్లకు, మదుపరులు ఆర్డర్ లకు సరిపోకపోతే లక్కీడిప్ ప్రకారం మాత్రమే వాటిని కేటాయిస్తారు. అంటే పబ్లిక్ లో కి అప్లై చేసినంత మాత్రాన ఆ షేర్లు మనకు కేటాయిస్తారన్నా నమ్మకం లేదు.
పెరిగిన డిమాండ్
గత ఆరు మాసాల్లో నమోదైన పబ్లిక్ శిష్యులకు మదుపర్ల నుంచి విపరీతమైన గిరాకీ ఉంది. హ్యాపీఎస్ట్ మైండ్ పబ్లిక్ ఇష్యూ కేవలం 3 రోజుల్లో పెట్టిన ఒక లాట్ పెట్టుబడి 15వేలకు, 35000 వచ్చేలా మార్కెట్లో నమోదయింది. ఇటీవల బర్గర్ కింగ్ పబ్లిక్ ఇష్యూ కూడా పెట్టిన పెట్టుబడిని రెట్టింపు చేసింది. తాజాగా బేక్టర్ ఫుడ్ పబ్లిక్ ఇష్యూ గురువారంతో ముగిసింది. దీనికి ఒక ఫ్లాట్ కు 19 అప్లికేషన్స్ వచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. అంటే ఒక లాట్ కోసం 19 మంది పోటీ పడుతున్నారు అన్నమాట.
ఎందుకు వస్తున్నాయి లాభాలు??
పబ్లిక్ ఇష్యూ లో పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవడానికి ప్రధాన కారణం ఏమిటంటే.. పబ్లిక్ ఇష్యూ నోటిఫికేషన్ లోనే కంపెనీ ఎంత ప్రైస్ లిస్ట్ ఇన్ అవుతుందనేది ప్రకటిస్తారు. ఉదాహరణకు బర్గర్ కింగ్ షేర్ 1 62 రూపాయల కి లిస్టింగ్ అవుతుందని ప్రకటించారు. అయితే ఐ పి ఓ పూర్తయి స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయినప్పుడు బర్గర్ కింగ్ పేరు సుమారు నూట అరవై ఐదు రూపాయల మేర నమోదయింది. లాట్ లో ఉన్న సుమారు షేర్ అరవై రెండు రూపాయలకు వినియోగదారుడు కొనుగోలు చేస్తే, అది లిస్టింగ్ సమయానికి 165 రూపాయలు అయింది అంటే ఒప్పో షేర్ మీద వంద రూపాయల పైన మిగిలినట్టు. దీంతో మూడు రోజుల్లోనే లిస్టింగ్ అయిన వెంటనే పెట్టుబడి రెట్టింపు అవుతోంది. దీంతో పెట్టుబడిదారులు లాభపడుతున్నారు.