నమ్రత ఘట్టమనేని డైరక్ట్ చేస్తున్నారు. అంటే మెగాఫోన్ చేతబట్టారని అర్థం కాదు. ఏ పనులు ఎవరెవరు ఎలా చేయాలి? ఎక్కడ ఎంత ఖర్చుపెట్టాలి అనే విషయాన్ని ఆమె డైరక్ట్ చేస్తున్నారు. ఆయా టీమ్లకు సరైన డైరక్షన్స్ ఇస్తున్నారు. నమ్రత ఘట్టమనేని పేరు టాలీవుడ్లో తెలియనివారు ఉండరు. ఒకప్పుడు కమర్షియల్ సినిమా హీరోయిన్ అయిన ఈమె, ఇప్పుడు ఘట్టమనేని ఇంటి వ్యవహారాలను సమర్థవంతంగా చూసుకుంటున్న మంచి కోడలు. మహేష్ ఖాతాలను, ఆయన సినిమాల వ్యవహారాలను ఇప్పుడు నమ్రత దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. జి మహేష్బాబు ఎంటర్ టైన్మెంట్స్ లో తెరకెక్కుతున్న సినిమాల వ్యవహారాలను ఆమె నేరుగా చూసుకుంటున్నారు. అడివి శేష్ హీరోగాఈ సంస్థ ఓ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు జి మహేష్బాబు ఎంటర్టైన్మెంట్ సంస్థ మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఆ సినిమా పనులను కూడానమ్రత దగ్గరుండి చూసుకుంటున్నారట. ఈ పనుల కోసం ఆమె హైదరాబాద్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని, ఆఫీస్గా అన్ని అరేంజ్మెంట్స్ చేయించుకున్నారట. ఎవరినైనా కలవాలన్నా, మాట్లాడాలన్నా అంతా అక్కడినుంచేనట.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!