Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని మార్కెట్ కలిగిన హీరో అల్లు అర్జున్ అని అందరికీ తెలుసు. సౌత్ ఇండియా లో టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి ఉన్న మార్కెట్ మరే హీరోకి లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా మలయాళంలో అయితే అల్లు అర్జున్ సినిమా రిలీజవుతుందంటే అక్కడి స్టార్ హీరోల సినిమాలు కూడా వాయిదా వేసుకునే పరిస్థితి. అటువంటిది మొట్టమొదటిసారి పాన్ ఇండియా తరహాలో తన సినిమా రెడీ చేస్తున్నాడు బన్నీ. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న పుష్ప సినిమా ఈ విధంగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఎప్పటినుండో సినిమాకి సంబంధించి షూటింగ్ జరుగుతూ ఉండగా తాజాగా.. ఈ సినిమా ఆగష్టు 13 వ తారీకు రిలీజ్ అవుతుందని పోస్టర్ తో కూడిన స్టిల్ ఒకటి సినిమా యూనిట్ అధికారికంగా రిలీజ్ చేయడం జరిగింది. అంతే కాకుండా ఇటీవల బన్నీ పుట్టినరోజునాడు సినిమా కి సంబంధించిన టీజర్ రిలీజ్ చేసి సినిమా పై మరింత హైప్ పెంచేశారు.
టీజర్ అదరగొట్టడంతో .. సోషల్ మీడియాలో కూడా అనేక రికార్డులు సృష్టించడం జరిగింది. దీంతో సంబరాల్లో ఉన్న అల్లు అర్జున్ అభిమానికి తాజాగా ఒక సరికొత్త షాక్ ఇచ్చే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే ఈ సినిమా రిలీజ్ మరింత వాయిదా పడే పరిస్థితి నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 17వ తారీకు రిలీజ్ చేయాలని తాజాగా ఈ సినిమా యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరియు గందరగోళ వాతావరణం థియేటర్లో ఫుల్లుగా ఆడియన్స్ కూర్చోలేని పరిస్థితులు దేశవ్యాప్తంగా ఉండటంతో.. సినిమా యూనిట్ మొత్తం ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నారు అనే వార్తలు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి.